Tuesday, September 15, 2026

భద్రాచలానికి మూడో వంతెన: కృతజ్ఞతగా మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

 

భద్రాచలం ప్రాంత ప్రజల చిరకాల రైల్వే కలను సాకారం చేసే దిశగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పాండురంగాపురం–భద్రాచలం–మల్కాన్‌గిరి 173.61 కిలోమీటర్ల నూతన రైల్వే లైన్‌ను మంజూరు చేయడాన్ని స్వాగతిస్తూ భద్రాచలంలో బీజేపీ శ్రేణులు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

అంతకుముందు అంబేద్కర్ సెంటర్‌లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు శ్రీ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. భద్రాచలం ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్న రైల్వే కనెక్టివిటీ కోసం గతంలో పాండురంగాపురం–సారపాక వరకు సుమారు 8 కి.మీ. రైల్వే లైన్‌ను కోరుకున్నామని, అయితే మోదీ ప్రభుత్వం పాండురంగాపురం నుంచి భద్రాచలం మీదుగా మల్కాన్‌గిరి వరకు 2864 కోట్లతో 2031లోగా పూర్తి చేసేలా 173.61 కి.మీ. రైల్వే లైన్‌ను మంజూరు చేయడం గొప్ప విషయమన్నారు.

ఈ ప్రాజెక్టులో భద్రాచలం వద్ద గోదావరిపై మూడో రైల్వే వంతెన నిర్మాణం  జరగడం ద్వారా భద్రాచలం నేరుగా రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానం కానుందని తెలిపారు. ఇది దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పెంచడంతో పాటు, ఏజెన్సీ గిరిజన ప్రాంతాల విద్య, వైద్యం, ఉపాధి, వ్యాపార అభివృద్ధికి* ఎంతో దోహదపడుతుందన్నారు.

ఇప్పటికే మంజూరైన ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసి, ఎలాంటి జాప్యం లేకుండా రైల్వే శాఖకు భూమిని అప్పగించాలని బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుంజా ధర్మా, కుంజా సంతోష్, కందుల రాంకిషోర్, పసుమర్తి సతీష్, అట్లూరి రఘురామ్, ములిశెట్టి రాంమోహన్ రావు, ముత్యాల శ్రీనివాస్, కండ్రపు త్రినాథ్ రెడ్డి, నూప రమేష్, రామెళ్ళ రాజశేఖర్, పెద్ది జగపతి బాబు, నిడదవోలు నాగబాబు, తాటిపాముల ఐలయ్య, ముత్యాల చంద్రశేఖర్, దేవరపల్లి వెంకటేశ్వర్లు, ములిశెట్టి నిఖిల్, షేర్ శ్రీను, జీవా, మాలోత్ సాయి, కారం చిన్నయ్య, కోర్స గంగరాజు, సోలం చంటిబాబు* తదితరులు పాల్గొన్నారు. 

Friday, September 11, 2026

ఈ నెల 17 న తెలంగాణా విమోచనా దినోత్సవాన్ని జరపాలి

 

 శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మరియు మండల నాయకులు  ఈనెల సెప్టెంబర్ 17 వ తారీకు నాడు కోరినారు.తెలంగాణా విమోచనా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని, అదేవిధంగా భద్రాచలంమండల కేంద్రంలో అధికారికంగా జరపాలని భద్రాచలం మండల MRO గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 17 వ తారీకు నాడు నిజాం రాజుల నిరంకుశ పాలనను అంతం చేసి అనేక పోరాటాల వల్ల, ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది, కాబట్టిఈ నెల సెప్టెంబర్ 17వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం అధికారికంగా జరుపుకోవాలని కోరినారు.

ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుంజాధర్మ . జిల్లా కార్యవర్గ సభ్యులు ములిశెట్టి రామ్మోహన్ రావు, జిల్లా నాయకులు నిడదవోలు నాగబాబు, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు దేవరపల్లి వెంకటేశ్వర్లు, ఓబీసీ జిల్లా నాయకులు గుమ్మాల వెంకటేశ్వర్లు సీనియర్ నాయకులు ఆవుల సుబ్బారావు , మండల ప్రధాన కార్యదర్శులు ముత్యాల చంద్రశేఖర్,  చెల్లిబోయిన వెంకన్న మండల ఉపాధ్యక్షులు షేర్ శ్రీనివాస్, గంగులకుర్తీ రామాచారి, యువ మోర్చా నాయకులు ములిశెట్టి నిఖిల్, ఓబిసి మండల ప్రధాన కార్యదర్శి. జంపాల ప్రభాకర్ తదితరులు ఫాల్గొన్నారు.  


 

సుభాష్ నగర్ వాసుల 'ఆశాజ్యోతి' ఎయిడెడ్ స్కూల్

 భద్రాచలం సుభాష్ నగర్ కాలనీలో పనిచేస్తున్న *గోపాలకృష్ణ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల స్కూల్ గ్రామస్తుల ఆశాజ్యోతి* గా నిలుస్తుందని భద్రాచలం గ్రామపంచాయతీ సర్పంచ్ *పూనెం.కృష్ణ* అభిప్రాయం వ్యక్తం చేశారు.

  బలహీన బడుగు వర్గాలకు అభ్యున్నతి కోసం మూడు దశాబ్దాల కాలము నుండి అంకితభావంతో సుభాష్ నగర్ లో *ఈ పాఠశాల పేద విద్యార్థులకు ఆశాదీపంగా పనిచేస్తుందని వార్డు నెంబర్ గోపి* తెలిపారు.

 ఈ పాఠశాలల *1995 ఒక చిన్న గుడిసెలో* ప్రారంభమైన ఈ పాఠశాల 2022 లో జిల్లా స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని జిల్లా కలెక్టర్ చేతులమీదుగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొంది అనంతరం 2023 సంవత్సరము లో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని ఆ *పాఠశాల ప్రధానోపాధ్యాయిని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయగా అవార్డు స్వీకరించటం ఆమె కృషికి నిదర్శనమని* వార్డు మెంబర్ గోపి హర్షద్వనాల మధ్య ప్రధానోపాధ్యాయుని కృషిని అభినందించారు.

ప్రస్తుతం ఈ పాఠశాలలో చదివే *ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఇదే పాఠశాలలో చదువుకున్నారని* ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయిని *వేంపాటి ఉషారాణి చెప్పటంతో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యంతో ఆనందం* వ్యక్తం చేశారు.

*1996 గోదావరి వరదల్లో పాఠశాల మొత్తం శిధిలావస్థకు* చేరి కింద పడిపోవటంతో దిక్కుతోచని స్థితిలో *ఆ కాలనీవాసులు నానాజీ వారిని ఒప్పించి మెప్పించి తాత్కాలిక రేకుల* షెడ్డు నిర్మించి 2020 అదే షెడ్లో పాఠశాలను నిర్వహించారు.

 అనంతరం పలుమార్లు వరదల్లో రేకుల షెడ్డు కూడా ప్రమాదంగా మారటంతో ఎప్పుడు షెడ్డుపడి విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందో అని ముందస్తు జాగ్రత్తతో ప్రధానోపాధ్యాయిని *ఐటిసి పేపర్ బోర్డ్ సారపాక వారి సహాయం కోసం పలుమార్లు అభ్యర్థన* చేయటంతో కంపెనీ ప్రతినిధులు సర్వే నిర్వహించి పాఠశాల అవసరాన్ని గుర్తించి *2022 కరస్పాండెంట్, ప్రధాన ఉపాధ్యాయుని సమన్వయంతో పాఠశాల భవన నిర్మాణానికి 20% ఆర్థిక సహాయాన్ని ఐ టి సి కంపెనీకి అందించి నూతన పక్క భవనాన్ని నిర్మించి* పాఠశాల ప్రాంగణం చుట్టూ ప్రహరి గోడ నిర్మాణంతో *జిల్లాలోనే ఒక మోడల్ స్కూల్ మైమరిపించే విధంగా పాఠశాల పనిచేస్తున్నట్లు గ్రామస్తులు నూకా రత్నం* తెలిపారు.

 ప్రస్తుతం ఈ పాఠశాల పక్కా భవనం *పిల్లలందరికీ పక్కా రన్నింగ్ వాటర్ తో కూడిన మరుగుదొడ్లు,వాష్ బేసిన్* అన్ని రకాల వసతులు ఈ పాఠశాల సొంతం అని వారు అభిప్రాయం తెలియజేశారు.

  *గ్రీన్ భద్రాద్రి వారి సహాయ సహకారాలతో పాఠశాల ప్రాంగణం మొత్తం పెద్దపెద్ద వృక్షాలతో పచ్చని వాతావరణానికి ఈ పాఠశాల కేరాఫ్ అడ్రస్* గా మారింది అని చెప్పక తప్పదు.

 ఈ నేపథ్యంలో ఈ పాఠశాలలో *ప్రతి విద్యార్థి తెలుగు, ఇంగ్లీష్,గణితం అంశాలలో కనీస అభ్యసనా సామర్థ్యాలు సాధించి మౌఖికంగా ఏ లెక్కల అడిగినా టక టక చెప్పి అందర్నీ అబ్బురపరచటం గమనార్హం* అని మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాస్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.

 అనంతరం *గ్రామ సర్పంచ్ చేతులమీదుగా విద్యార్థులందరికీ నూతన ఏకరూప దుస్తులు* అందించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు అందరి సమక్షంలో ప్రధానోపాధ్యాయని, మండల విద్యాశాఖ అధికారి *పాఠశాలకు విచ్చేసిన గ్రామ సర్పంచ్ పూనెం. కృష్ణను ఘనంగా శాలువాతో సత్కరించారు.*

ఈ కార్యక్రమంలో గ్రామ *సర్పంచ్ పూనెం.కృష్ణ, వార్డు నెంబర్ కావూరి.గోపి,మండల ఏపిఎం, టైలర్ దాసు, పాఠశాల క్లస్టర్ రిసోర్స్ పర్సన్ గోపికృష్ణ, ఎండిఎం నిర్వాహకురాలు నూకరత్నం* తదితరులు పాల్గొన్నారు.


Thursday, September 10, 2026

పూల బొకే ఇచ్చి ఆశీర్వదించారు.

గాదె మాధవ రెడ్డి అస్వస్థకు గురై హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో వైద్య సేవలు తీసుకొని భద్రాచలం వచ్చిన సందర్భంగా ఎందరో రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఆత్మీయులు బంధువులు స్నేహితులు అలాగే కళాకారులు. ఉపాధ్యాయులు, మిత్రులు శ్రేయోభిలాషులు, చాలామంది పరామర్శించి ,త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈరోజు కళాబంధు మేము సైతం కళా సేవలో తెలంగాణ సేవా సంస్థ సభ్యులు బెల్లంకొండ దుర్గా కోమలి, మరిగంటి పద్మావతి, కత్తి కనకదుర్గ , జెమిని రామలక్ష్మి, కోట దుర్గాప్రసాద్ అందరికన్నా భిన్నంగా గాదె మాధవరెడ్డి  స్వగృహానికి చేరుకొని వారి యొక్క కవిత్వంతో.. పాటలతో.. అలరించి ఎంతో ప్రేమతో త్వరగా కోలుకోవాలని పూల బొకే ఇచ్చి ఆశీర్వదించారు.

సాయి బాబా స్వర్ణ సింహాసనానికి లక్ష విరాళం

భద్రాచల వాసి ప్రముఖ పర్యావరణ ప్రేమికుడు భద్రాచలం గ్రామాన్ని హరిత భద్రాద్రి గా తీర్చి దిద్దాలని గత 15 స. లు గా వారి బృందం తో కలసి తీవ్రం గా కృషిచేస్తున్న ''వృక్ష మిత్ర '' రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహిత లయన్ డా. గోళ్ళ భూపతి రావు కు ఎన్నో ప్రశంసలు. భద్రాచలం గ్రామం పచ్చదనం తో ఉంది అంటే అత ని పట్టుదల అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు.

 అంతే కాకుండా స్వయం గా దానగు ణం గల వీరు ఎన్నో సేవ కార్యక్రమాలు ని ర్వహిస్తున్నారు. అడిగిన వారికి కాదనకుండా సహయం చేయటం, మొక్కలు పంచడం వీరికి అలవాటు. భద్రాచలం లో ఉన్న దేవాలయాలకు వారి కుమారుడు డాక్టర్ గోళ్ళ వరుణ్ కుమార్ ఎమ్ ,డి , యు. ఎస్. ఏ., వారు కూడా విరాళాలు అందచేశారు. వీరి చిన్నతనం లో స్థాపించిన సాయిబాబా ఆలయం వారికి స్వర్ణ సింహాసనం తయారు నిమిత్తం గోళ్ళ భూపతి రావు, మంజుల రాణి దంపతులు ఒక లక్ష విరాళం అందచేశారు. 

ఈ సందర్బంగా గోళ్ళ భూపతి రావు మాట్లాడుతూ ప్రతి వారు వారి జీవితం లో కొంత భాగం పేదవారికి సహాయం చేయడం అలవాటుగా నేర్చుకోవాలని ఇతరులకు ఆదర్శం గా నిలవాలని తెలియ చేసారు. అదేవిధంగా నా ఈ సమాజ సేవ కార్యక్ర మాలను కొనసాగిస్తూ పర్యావరణ పరిరక్షణకు ఎల్లప్పుడు ముందు వరుసలో ఉంటానని తెలియచేశారు. ఈ కార్యక్రమం లో ఆలయ అధ్యక్షులు శ్రీ ఆదినారాయణ,శ్రీ చా రుగుళ్ల సుబ్బా రావు కోశాధికారి వెంకటేశ్వర రావు, శ్రీ కడలి నాగరాజు మరియు ఆలయ అర్చకులు శ్రీ రామ్ శర్మ తదితరులు పాల్గొన్నారు


విద్యార్థుల ధ్రువపత్రాల జాప్యాన్ని వెంటనే పరిష్కరించాలి


ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, పీజీ ప్రవేశాల ప్రక్రియలు కొనసాగుతున్న వేళ విద్యార్థులకు అవసరమైన కుల, సమగ్ర, ఆదాయ, నివాస ధ్రువపత్రాల జారీలో జరుగుతున్న జాప్యాన్ని వెంటనే పరిష్కరించాలని కోరుతూ భద్రాచలం బీజేపీ ఎస్టీ మోర్చా, యువమోర్చా ఆధ్వర్యంలో భద్రాచలం తహసీల్దార్ వై. రవికుమార్కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా *బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా సంతోష్* మాట్లాడుతూ, మీ సేవ ద్వారా దరఖాస్తు చేసిన అనంతరం సంబంధిత సిబ్బంది పరిశీలన, ఆర్‌ఐ ధృవీకరణ, తహసీల్దార్ స్థాయి ఆమోదం వంటి వివిధ దశల్లో సమన్వయం లోపించడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఉద్యోగ, విద్యా ప్రవేశాల గడువులు సమీపిస్తున్న నేపథ్యంలో *పెండింగ్ దరఖాస్తులను ప్రత్యేకంగా సమీక్షించి, అత్యవసర దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి ధ్రువపత్రాలను త్వరితగతిన జారీ చేయాలని* కోరారు. అలాగే విద్యార్థులు తమ ధ్రువపత్రాల దరఖాస్తు స్థితిని సులభంగా తెలుసుకునేందుకు తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

అదేవిధంగా, *ఉద్యోగం లేదా విద్యా ప్రవేశానికి గడువు ఉన్న విద్యార్థులు* తమ పెండింగ్ ధ్రువపత్రాల వివరాలను బీజేపీ సహాయ కేంద్రానికి పంపితే, వారి దరఖాస్తు స్థితిని సంబంధిత అధికారుల వద్ద తెలుసుకుని, అవసరమైన మేరకు అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఫాలోఅప్ చేస్తామని కుంజా సంతోష్ తెలిపారు.

📱 *వాట్సాప్ సహాయ కేంద్రం: 9866060034*

విద్యార్థులు మీ సేవ దరఖాస్తు సంఖ్య, ధ్రువపత్రం పేరు, దరఖాస్తు తేదీ, ఉద్యోగం/ప్రవేశానికి సంబంధించిన గడువు వివరాలను పై నంబర్‌కు వాట్సాప్ చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో యువమోర్చా నాయకులు ములిశెట్టి నిఖిల్, అన్నెం సాయి లక్ష్మణ్, కిలారు అంజి, గంగులకుర్తి రామాచారి తదితరులు పాల్గొన్నారు. 

 

Tuesday, September 8, 2026

అక్రమ అరెస్ట్ ను ఖండించండి

 

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంఎల్సి తాతమధు అక్రమంగా అరెస్టును చర్ల మండల బిఆర్ యస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు కో కన్వీనర్ ఐనవోలు పవన్ తీవ్రంగా ఖండించారు.

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హమీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రజలకు కోసం ఉద్యమాలు చేస్తుంటే కాంగ్రెస్ చూడ లేక ఓర్వ లేక బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంఎల్సిలను అసెంబ్లీలోకి వెళ్ళనీయకుండా పోలీసులతో కొట్టించడం, కింద పడేసి తొక్కడం మహిళ ఎంఎల్ఏలు అని చూడకుండా మెడ పట్టుకుని తోయడం చీరలు లాగి అవమానించడం చరిత్రలో ఎప్పుడు జరగని ఈ చర్యను చూసి తాతమధు  చేసిన వ్యాఖ్యలను పట్టుకుని ప్రజా సమస్యలకు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. తాతమధు  ఆ సందర్భంలో అన్న మాటలు గౌరవనీయులైన స్పీకర్ గారికి బాధ కలిగించినటైతె తన వ్యాఖ్యలను వెనకకు తీసుకుంటున్నాను అని పత్రిక ముఖం తెలియజేసిన అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులైన మహిళలకే రక్షణ లేక పోతే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం నిన్న మహిళ ఎంఎల్ఏలకు జరిగిన అవమానం తెలంగాణ రాష్ట్ర మహిళలందరికి జరిగిన అవమానం కాబట్టి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.