Saturday, August 22, 2026

"దాబా హోటల్ " తెలుగు నవల

 దాబా హోటల్ అనే నవల చదివిన తర్వాత ఈ రెండు మాటలు పంచుకోవాలనిపించింది.ఉషా-వెలగపూడి స్మారక నవలల పోటీలో ఈ నవల ప్రథమ బహుమతి పొందింది.రచయిత శిరంశెట్టి కాంతారావు గారు.ఈ నవల చదవడం మొదలుపెట్టగానే దించకుండా ఏకబిగిన చదవడం జరిగింది.ఈమధ్య కాలం లో ఇలా నాచేత చదివించిన రచనలు బహు అరుదు. తెలుగు నవల లో ఇంతవరకు నాకు ఎక్కడా తారసపడని ఇతివృత్తాన్ని తీసుకున్నారు. తీసుకోవడమే కాదు ఆ విషయాన్ని లోతుగా పరిశోధించారు. కేవలం పరిశోధించడం మాత్రమే కాదు దాన్ని జవజీవాలతో సమకాలీన వాస్తవ మానవ జీవితాలతో ముడివేశారు.

ఇది కల్పితం కాదు.మనం విజయవాడ-రాయ్ పూర్ జాతీయ రహదారి మీదుగా ప్రయాణిస్తుంటే పాల్వంచ అనే పారిశ్రామిక పట్టణం తగులుతుంది.అక్కడ రహదారి కి పక్కన ఉన్న దాబా హోటళ్ళు కనబడతాయి. సాయంత్రం నుంచి కళకళ లాడుతూ కనిపించే ఈ హోటళ్ళ వెనుక ఉన్న చరిత్ర ని,ఆ చరిత్ర నిర్మించిన హరిభజన్ సింగ్ జీవిత సమరాన్ని ఈ నవల చిత్రించింది. అభిరుచి ఉన్న చిత్ర దర్శకుడు ఈ నవల గనక చదివితే చక్కని విన్నూత్నమైన సినిమా తీయగలడనిపించింది.బిచ్చం అనబడే ఒక తండా లోని బాలుడు ఇంటి వద్ద ఆదరణ కరువై , ఒక పంజాబీ లారీ డ్రైవర్ ద్వారా నాందేడ్ లోని గురుద్వారా కి చేరుకోవడం ,అక్కడ గురుసేవ లో భాగంగా  రొట్టెలు తయారీ లో ఫాల్గొంటూ తన జీవన విధానాన్ని మలుచుకోవడం ఆసక్తి గా సాగుతుంది.

ఈ నవల లో సిక్కు మత సంప్రదాయాలు,ఆచార వ్యవహారాలు చక్కగా వివరించారు.బిచ్చం సిక్కు మతం లో చేరతానని అన్నప్పుడు తల్లిదండ్రుల అనుమతి తీసుకొని రమ్మని ప్రధానగ్రంథీ పంపించడం , రోజువారీ సిక్కు మతస్తుని జీవితం సాగే విధానం ఆకట్టుకుంటాయి.బాలుడు గా ,యువకునిగా,తండ్రిగా బిచ్చం అనబడే హరిభజన్ సింగ్ జీవితం సాగే వైనం మనకి అనేక కొత్త సంగతులు తెలుపుతాయి.అదీగాక ఇదంతా కూడా ఇది నిజంగా ఇప్పటికీ నిలిచి ఉన్న దాబా హోటళ్ళ పునాది యొక్క చరిత్ర అని తెలుసుకున్నప్పుడు మరింత ఉత్సూకత కలుగుతుంది.నూతనత్వాన్ని కోరుకునే  ప్రతి తెలుగు పాఠకుడు ఈ నవలని తప్పక చదవాలి.

దాబా హోటల్ (నవల)

పేజీలు:151

వెల:రూ.150/-   

ప్రతులకు ; 98498 90322


--- Reviewd by Murthy Kvvs

Tuesday, August 18, 2026

ఎఫ్ ఎల్ ఎన్ తో శ్వాస పీల్చాలి.. ఎఫ్ ఎల్ ఎన్ తో శ్వాస వదలాలి

 ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయులందరూ బోధనలో విద్యార్థి కేంద్రంగా చేసుకొని ఎఫ్.ఎల్.ఎన్ తో శ్వాస వీల్చు పీల్చుకొని ఎఫ్. ఎల్.ఏం తో శ్వాస విడిచే అంత ప్రాముఖ్యత  తో  ప్రాథమిక విద్యా బోధన ఉండాలని మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి  శ్రీనివాసరావు ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. 

 మంగళవారం నాడు భద్రాచలం మండల రిసోర్స్ కేంద్రం లో మండల విద్యాశాఖ అధికారి అధ్యక్షతన  ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక, కేజీబీవీ, ఎయిడెడ్ ప్రధానోపాధ్యాయుల సమావేశం జరిగింది.

 ఈ సమావేశంలో మండల విద్యాశాఖ అధికారి పాఠశాల స్థాయిలో గుణాత్మకమైన విద్య సాధించడానికి తరగతి గదిలో అభ్యసనా సామర్థ్యాలను విద్యార్థి కేంద్రంగా చేసుకొని ఎలా సాధించాలో సుమారు రెండు గంటల పాటు ప్రధానోపాధ్యాయులు అందరికీ శిక్షణ నిర్వహించారు. 

 బుధవారం మరియు గురువారం నాడు మండలం లోని కాంప్లెక్స్ స్థాయిలో నిర్వహించే కాంప్లెక్స్ సమావేశాలలో తీసుకోవాల్సిన, పాటించాల్సిన,బోధించాల్సిన పలు అంశాలపై కాంప్లెక్స్ హెడ్మాస్టర్లకు సూచనలు చేశారు.

 ఈ నేపథ్యంలో ఈ ఏడాది మండల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో నమోదు అత్యధికంగా సాధించిన జాన్సన్( గవర్నమెంట్ హై స్కూల్ ), T.రమా( జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల ), రాజా శ్రీనివాస్( మండల ప్రాథమికోన్నత పాఠశాల జగదీష్ కాలనీ), పాపయ్య ( ప్రాథమిక పాఠశాల తాత గుడి సెంటర్ ) ప్రధానోపాధ్యాయులకు ఘన సన్మానాన్ని నిర్వహించారు. 

 ఈ కార్యక్రమంలో సి ఆర్ పి లు గోపి, ఆర్ కె, సిసి బేబీ, ఐ ఈ ఆర్ పి S. పద్మ మరియు ఏ పి ఎం  తదితరులు పాల్గొన్నారు.

Saturday, August 15, 2026

రచయిత మూర్తి ని ఘనంగా సన్మానించిన వృక్షమిత్ర డా.గోళ్ళ భూపతి రావు

అనేక ప్రక్రియల్లో రచనలు చేసి ప్రముఖ రచయిత గా పేరుపొందిన కెవివిఎస్ మూర్తి తన ఇటీవల అనువాద పుస్తకం మిష్మీకొండలు గొప్ప విజయం పొందిన సందర్భం లో వృక్షమిత్ర అవార్డ్ గ్రహీత, ప్రముఖ సంఘ సేవకులు డా. గోళ్ళ భూపతి రావు దుశ్శాలువతో ఘనంగా సన్మానించారు. తెలంగాణా రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనం లో ఈ కార్యక్రమం జరిగింది. గతం లో మూర్తి అనువదించిన గాడ్ ఫాదర్ అనే గ్రంథం తెలుగు లో వెలువడి దేశవిదేశాల్లోని తెలుగు పాఠకుల్ని సైతం విశేషం గా అలరించిందని, ప్రస్తుతం తెలుగు లోకి అనువదించిన మిష్మీ కొండలు పుస్తకం ఈశాన్య భారత దేశం లో జరిగిన స్వాతంత్ర పోరాటాన్ని చిత్రించినదని తెలిపారు. డా.గోళ్ళ భూపతి రావు ఇంకా పుస్తక విశిష్టత ని వివరిస్తూ దీని ఆంగ్లం ఓ రాసిన  మూల రచయిత్రి మమాంగ్ డాయ్ ఒక విశ్రాంత ఐ.ఏ.ఎస్. అధికారిణి అని చెబుతూ,ఇప్పటికే ప్రముఖ దిన పత్రికల్లో చక్కని రివ్యూలు వచ్చాయని అభినందించారు.

విశ్రాంత ఉద్యోగుల కార్యాలయం లో పంద్రాగస్ట్ వేడుకలు

ఎన్నో త్యాగాలతో తెచ్చుకున్న స్వాతంత్ర్య ఫలాల్ని అందరికీ అందేలా ప్రతి పౌరుడు తన విధిని చిత్తశుద్ధి తో నిర్వర్తించాలని,చారిత్రక ఘటనల్ని వివరిస్తూ దేశభక్తుల జీవితాల్ని సోదాహరణం గా వివరిస్తూ నాటి వారి త్యాగాల్ని మరిచిపోరాదని తెలంగాణా రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ డివిజన్ అధ్యక్షులు జి.భూషణం పిలుపునిచ్చారు. పంద్రాగస్టు ని పురస్కరించుకుని కార్యాలయ ప్రాంగణం లో జాతీయపతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. విశ్రాంత ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఫాల్గొన్నారు. ప్రధాన కార్యదార్శి కె.మధుసూదన్ రావు,అసోసియేట్ అధ్యక్షులు జి.వెంకన్న,మీడియా కార్యదర్శి గాదె తులసీ దాస్ ఇంకా ఇతరులు మాట్లాడారు. 



ఉత్తమ ఉద్యోగి’ అవార్డు అందుకున్న బొల్లి వెంకటరాజు

భద్రాచలం, ఆగస్ట్ 15: నిరంతరం ప్రజా సేవలో నిమగ్నమై, విధి నిర్వహణలో నిబద్ధత, అంకితభావం కనబరిచే ఉద్యోగుల కష్టానికి ఎల్లప్పుడూ తగిన గుర్తింపు లభిస్తుందని మరోసారి నిరూపితమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో తనదైన పనితీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న  బొల్లి వెంకటరాజు జిల్లా స్థాయి "ఉత్తమ ఉద్యోగి" పురస్కారాన్ని అందుకున్నారు..

​ఘనంగా పురస్కార ప్రదానోత్సవం!

వరంగల్ ​జిల్లా కేంద్రంలో నిర్వహించిన అధికారిక వేడుకల్లో భాగంగా,NPDCL ( సిఎండి )   కర్నాటి వరుణ్ రెడ్డి (IAS)  చేతుల మీదుగా, బొల్లి వెంకటరాజు ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.

​ఈ సందర్భంగా( సి ఎం డి ) మాట్లాడుతూ:సమాజ అభివృద్ధిలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమైనది. తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ, ప్రజలకు సేవలందించే ఇలాంటి ప్రతిభావంతులైన ఉద్యోగులు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు.కష్టపడి పనిచేసే తత్వానికి దక్కిన గౌరవం.​ బొల్లి వెంకటరాజు  తన విధుల్లో చూపిన క్రమశిక్షణ, ప్రజల పట్ల ఉన్న సేవాభావం మరియు క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి చూపిన చొరవకు ఈ అవార్డు నిదర్శనంగా నిలిచింది. ఎలాంటి ఒత్తిడులు ఎదురైనా చిరునవ్వుతో బాధ్యతలు నిర్వర్తించడం ఆయన పనితీరులోని ప్రత్యేకత అని తోటి ఉద్యోగులు కొనియాడారు.

​వెల్లువెత్తిన అభినందనలు!

​బొల్లి వెంకటరాజు ( సీఎం డి ) చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకోవడం పట్ల:తోటి ఉద్యోగులు, సిబ్బంది.ఉన్నతాధికారులు ​కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు.హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ అవార్డు ఆయన అంకితభావానికి, నిరంతర శ్రమకు దక్కిన ప్రతిఫలమని, భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, సమాజానికి మరింతగా సేవలందించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.



Friday, August 14, 2026

​సెప్టెంబరు 9 లోగా కౌంటర్ దాఖలు చేసి స్టే ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలి


కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత విధానాలు, నిర్లక్ష్య వైఖరి వల్లే పేదింటి ఆడపిల్లలకు ఆసరాగా నిలిచే ‘కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్’ పథకాలపై హైకోర్టు స్టే విధించే పరిస్థితి వచ్చిందని  బి ఆర్ ఎస్ పార్టీ చర్ల మండల కన్వీనర్ దొడ్డి తాతారావు అన్నారు. 

పేద వర్గాలకు ఈ పథకాల ఫలాలు అందకూడదనే దుర్బుద్ధితో, బడ్జెట్ నిధులను ఎగ్గొట్టాలనే కుట్రతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలని కోర్టు వ్యవహారాల్లో అలసత్వం వహిస్తోందని దొడ్డి తాతారావు ఆరోపించారు హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై స్పందిస్తూ, విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేస్తామని స్వయంగా అడ్వొకేట్ జనరల్ తెలిపినప్పటికీ... న్యాయస్థానం పలుమార్లు అవకాశమిచ్చినా ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ సమర్పించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ తీవ్ర బాధ్యతారాహిత్యానికి ప్రత్యక్ష నిదర్శనమని మండిపడ్డారు.

​గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఆర్థిక సాయంతో పాటు అదనంగా "తులం బంగారం" ఇస్తామని రంగుల హామీలు ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక ఆ తులం బంగారం ఇవ్వకపోగా కేసీఆర్ గారి హయాంలో ప్రజాదరణ పొందిన ఈ మహత్తర పథకాలను పూర్తిగా రూపుమాపేందుకు నాటకాలకు తెరలేపిందని అన్నారు 

2014 నుంచి బీఆర్‌ఎస్‌ పాలనలో కేసీఆర్ నాయకత్వంలో పేద కుటుంబాలలోని యువతుల వివాహ ఖర్చుల భారాన్ని తగ్గించి, ఆర్థికంగా ఆదుకోవడానికి 'కల్యాణ లక్ష్మి', 'షాదీ ముబారక్' పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. 

నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన లక్షలాది మంది ఆడబిడ్డల పెళ్లిళ్లకు కొండంత అండగా నిలుస్తూ, ప్రతి ఏటా సగటున రూ. 1,400 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించి వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించామని అన్నారు 

​ప్రభుత్వం ఇప్పటికైనా నిద్రమత్తు వీడి, తదుపరి విచారణ గడువైన సెప్టెంబరు 9 లోగా ఉన్నత న్యాయస్థానంలో బలమైన కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలి.

​అవసరమైతే చట్టసభల ద్వారా ఈ పథకాలకు ప్రత్యేక చట్టబద్ధత కల్పించి, కోర్టు స్టే ఎత్తివేసేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి ​పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారులందరికీ వెంటనే ఆర్థిక సాయం నిధులను విడుదల చేయాలిఅన్నారు.



Thursday, August 13, 2026

పూర్వ వైభవం దిశగా డాక్టర్ పాలరాజు ఇంజనీరింగ్ కాలేజీ


భద్రాచలం,ఆగస్టు 13 : భద్రాచలం పరిసర ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యను అందించాలనే మహోన్నత లక్ష్యంతో స్థాపించబడిన డా.పాల్ రాజ్ ఇంజనీరింగ్ కాలేజీ మరోసారి పూర్వవైభవాన్ని సంతరించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జేఎన్‌టీయూ హైదరాబాద్ అనుబంధంలో తొలి క్రిస్టియన్ మైనారిటీ ఇంజనీరింగ్ విద్యాసంస్థగా పేరొందిన ఈ కళాశాల వేలాది మంది విద్యార్థులను ఉన్నత స్థాయికి తీర్చిదిద్దింది.ఈ కళాశాలలో చదివిన అనేక మంది విద్యార్థులు కార్పొరేట్ కళాశాలల విద్యార్థులకు ఏమాత్రం తీసిపోకుండా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి దేశ, విదేశాల్లో ప్రముఖ సంస్థల్లో ఉన్నత పదవుల్లో స్థిరపడి కళాశాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు.

ప్రస్తుతం జేఎన్‌టీయూ కాకినాడ అనుబంధంలో భద్రాచలం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో కొనసాగుతున్న ఈ కళాశాలలో నూతన యాజమాన్యం బాధ్యతలు స్వీకరించింది. అర్హత కలిగిన ప్రొఫెసర్లు, ఆధునిక ల్యాబొరేటరీలు, బాలురు–బాలికలకు ప్రత్యేక హాస్టళ్లు, మెరుగైన మౌలిక వసతులతో విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు యాజమాన్యం వెల్లడించింది.విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకే మేనేజ్‌మెంట్ సీట్లు అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది అలాగే తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ అనే భేదం లేకుండా దేశంలోని ఏ జిల్లా, ఏ రాష్ట్రానికి చెందిన విద్యార్థులైనా ఈ కళాశాలలో ప్రవేశాలు పొందవచ్చని యాజమాన్యం స్పష్టం చేసింది ప్రస్తుతం బీటెక్ (B.Tech) ఎం.టెక్ *(M.Tech)*డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్నాయని, ఆసక్తి గల విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది. పూర్తి వివరాలకు

📞 98483 69806 సంప్రంచగలరు.