Friday, September 4, 2026

వంట వార్పు మరియు మహిళా నిరసన కార్యక్రమం

 బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపుమేరకు డివిజన్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ మానెం రామకృష్ణ ఆదేశానుసారం ఈ రోజు చర్ల BRS మండల కన్వీనర్ దొడ్డి తాతారావు గారి ఆధ్వర్యంలో చర్ల పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన వంట వార్పు మరియు మహిళా నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భద్రాచలం బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం నాయకుడు మానె రామకృష్ణ గార్లు. 

 ఈ కార్యక్రమంలో మాట్లాడుతు కాంగ్రెస్ 1000 రోజుల పాలనకు నిరసనగా తెలంగాణ రాష్ట్రంలో 2 నుండి 8 వరకు జరుగుతాయి ఎన్నికల్లో 6 గ్యారంటీలు 420 హమీలతో అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో హమీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల అయ్యిన ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదు. అందుకే ఈరోజు మహిళలకు హమీలు అమలు చేయాలని కళ్యాణ్ లక్ష్మి షాదిముబారాక్ కెసిఆర్ కిట్టు విద్యార్థినులకు స్కూటీలు ప్రతీ ఇంటి మహిళకు 2500 ఈ హమీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్.

 ఈ కార్యక్రమంలో చర్ల బిఆర్ఎస్ పార్టీ కో కన్వీనర్ అయినవోలు పవన్ కుమార్ సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్ పంజా రాజు కాకి అనిల్ కొంబత్తిన రాము గోరింట్ల వెంకటేశ్వరరావు అంబోజి సతీష్ తడికల బుల్లెబ్బాయి కుప్పాల నిరంజన్ కుప్పాల సౌజన్య పాసిగంటి సంతోష్ దుబ్బ సమ్మయ్య తడికల చంద్రశేఖర్ కట్టం కన్నారావు గాదం సెట్టి కిషోర్ కుక్క డప్పు సాయి పాసిగంటి సంధ్య మచ్చ రాణి మహిళా సర్పంచులు పెద్ద ముసిలేరు సర్పంచ్ బెండ బోయిన సుహాసిని ఉప్పరిగూడెం సర్పంచ్ సోయం నాగలక్ష్మి కుదునూరు సర్పంచ్ కుంజా కమల మరియు నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు


Thursday, September 3, 2026

రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమం

ఈరోజు కెటిఆర్ ఆదేశాల మేరకు రైతు సమస్యలపై కొత్తపల్లి గ్రామంలో రైతు సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తీవ్ర అన్యాయం చేసిందని బీఆర్‌ఎస్ చర్ల మండల కన్వీనర్ దొడ్డి తాతారావు ఆరోపించారు  రైతు సంక్షేమం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో రైతుల కష్టాలు మరింత పెరిగాయని విమర్శించారు.

రైతు రాజ్యం వస్తుందని ఆశిస్తే రావణ రాజ్యం వచ్చింది అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు

రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోకుండా రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు

రైతు బీమా పథకాన్ని ఎత్తివేసారని  రుణమాఫీ అసంపూర్తి గా చేశారన్నారు.

గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం అమలు చేసిన రైతు బీమా వంటి పథకాలు రైతు కుటుంబాలకు భరోసా కల్పించాయని అన్నారు. 

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బీమా విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు అదే విధంగా రైతులకు హామీ ఇచ్చిన రుణమాఫీ కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు.

 ఎన్నికల సమయంలో రైతులకు సంవత్సరానికి రైతు భరోసా కింద రూ.15 వేల చొప్పున అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.

  పండించిన పంటకు గిట్టుబాటు ధర,సన్న వడ్లకు రూ.500 బోనస్,కౌలు రైతులకు రైతు భరోసా వంటి హామీలు ఇచ్చినా వాటి అమలులో ప్రభుత్వం విఫలమైందని అన్నారు

*కౌలు రైతులకు ఇస్తామన్న భరోసా ఏదని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆ హామీ అమలు పరిస్థితి ఏమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు* 

*ధాన్యం కొనుగోలు కేంద్రాలపై నిర్లక్ష్యం

రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయడం లేదని బీఆర్‌ఎస్ నాయకుడు ఆరోపించారు. ధాన్యం కొనుగోలులో రైతులు ఇబ్బందులు పడుతున్నారని,సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి చివరకు ఒక సీజన్ కు మాత్రమే పరిమితం చేశారని, దాన్ని ఈ సంవత్సరం ఏడు రకాల వడ్ల ను సాగు చేసిన వారికే అంటూ బోనస్‌ను బోగస్‌గా మార్చారని విమర్శించారు.

యూరియా కోసం రైతుల అవస్థలు పడుతున్నారనిప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని  అన్నారు.

పంటల సాగు కీలక దశలో ఎరువులు సకాలంలో అందించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు

యూరియా కోసం యాపులు పెట్టిన రాబందు ప్రభుత్వం అంటూ ఘాటుగా విమర్శించారు. రైతులకు అవసరమైన యూరియాను సకాలంలో, సరిపడా అందించాలని డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ కో కన్వీనర్ అయినవోలు పవన్ కుమార్ కొత్తపల్లి సర్పంచ్ ఉప్పట్ల నాగలక్ష్మి మొగల్లపల్లి ఉపసర్పంచ్ ఎడ్ల రామదాసు నియోజకవర్గ యువజన నాయకులు కాకి అనిల్ పంజా రాజు  మండల మండల నాయకులు సయ్యద్ అజీజ్ బట్ట కొమరయ్య రాట్నాల శ్రీరామ్మూర్తి  యూత్ అధ్యక్ష కార్యదర్శులు అంబోజి సతీష్ కుప్పల నిరంజన్ BC సెల్ అధ్యక్షులు గోరింట్ల వెంకటేశ్వరరావు SC సెల్ అధ్యక్షులు కొంబతీని రాము యువజన నాయకులు తడికల బుల్లేబాయ్ గదేంశెట్టి కిశోర్ కుక్కడపు సాయి మైప వెంకటేశ్వర్లు సాంబ  నాయకులు,కార్యకర్తలు,యువజన నాయకులు,రైతులు పాల్గొన్నారు...

మండల విద్యాధికారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశం

 ఈరోజు స్థానిక మండల విద్యా వనరుల కేంద్రం భద్రాచలం నందు మండల విద్యాధికారి బెక్కంటి శ్రీనివాసరావు   గారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది.

 ఈ సందర్భంగా హాజరైన ఉపాధ్యాయ సంఘాల నాయకులను ఉద్దేశించి మండల విద్యాధికారి మాట్లాడుతూ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల విద్యా వనరుల కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని ఆ కార్యక్రమంలో మండలంలో పాఠశాలల అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తున్న 8 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారిని సన్మానిస్తామని దానికి అన్ని సంఘాల సహాయ సహకారాలు అందించాలని కోరడం జరిగింది. సందర్భంగా ఆయా  నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేయడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో పిఆర్టియు మండల బాధ్యులు టి రామకృష్ణ, బి కృష్ణ, టీఎస్ యుటిఎఫ్ బాధ్యులు ఎస్ విజయ్ కుమార్, కే శ్రీనివాసరావు, పి ఎస్ వి ప్రసాద్ బాబు, ఆట సంఘ నాయకులు కలం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Wednesday, September 2, 2026

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ

 భద్రాచలం మండలం పరిధిలోని లంబాడి కాలనీలో ప్రాథమిక పాఠశాలలో బుధవారం నాడు మండల విద్యాశాఖ అధికారి సందర్శించి వారి చేతులమీదుగా విద్యార్థులందరికీ నూతన యూనిఫామ్ ని పంపిణీ చేశారు.

 అనంతరం ఎంతో ఆనందంగా విద్యార్థులందరూ యూనిఫామ్ ధరించి మండల విద్యాశాఖ అధికారి సమక్షంలో ఉపాధ్యాయులతో ఫోటోలు దిగి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు KNVR జగన్ మోహన్ రావు  ఉపాధ్యాయిని S. అరుణ తోపాటు క్లస్టర్ రిసోర్స్ పర్సన్ గోపికృష్ణ టైలర్ దాసు తోపాటు తదితరులు పాల్గొన్నారు.

చర్ల నుంచి భద్రాచలం వరకు భారీ బైక్‌ ర్యాలీ

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్‌ చర్ల మండల కన్వీనర్‌ దొడ్డి తాతారావు విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు నిరసనగా బుధవారం చర్ల నుంచి భద్రాచలం వరకు సుమారు 200 ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పిలుపు మేరకు చేపట్టిన సమరభేరి కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గులాబీ జెండాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. 

ఈ సందర్భంగా దొడ్డి తాతారావు మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజులు గడిచినా హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. రైతు భరోసా, కల్యాణలక్ష్మి, తులం బంగారం, ఆసరా పింఛన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, యువతకు ఉద్యోగాలు తదితర హామీలను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలకు వివరిస్తూ ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

“బాధితులు బయటకు రండి.. బీజేపీ అండగా ఉంటుంది”

దుమ్ముగూడెం మండల కాంగ్రెస్ అధ్యక్షులు తెల్లం హరికృష్ణ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.15 లక్షలు తీసుకున్నారన్న ఆరోపణలు, ఈ వ్యవహారంతో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పీఏ కళ్యాణ్‌కు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయని బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు కుంజా ధర్మా తెలిపారు. 

ఈ వ్యవహారం ద్వారా భద్రాచలం నియోజకవర్గానికి చెందిన మరికొందరు కాంగ్రెస్ నాయకుల ప్రమేయంపై కూడా తీవ్ర ఆరోపణలు వెలువడుతున్నాయని, మొత్తం వ్యవహారం రూ.15 నుంచి రూ.20 కోట్ల వరకు ఉండొచ్చన్న సమాచారం ఉందన్నారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగాల పేరుతో డబ్బులు చెల్లించి మోసపోయిన బాధితులు ధైర్యంగా బయటకు రావాలని కుంజా ధర్మా పిలుపునిచ్చారు. బాధితులతో కలిసి తెలంగాణ డీజీపీని స్వయంగా కలిసి సమగ్ర విచారణకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అవసరమైతే కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహకారంతో ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.

బాధితుల్లో ఆదివాసీలు ఉంటే జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా న్యాయం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బాధితులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, మీకు జరిగిన అన్యాయంపై ఆధారాలతో ముందుకు వస్తే బీజేపీ అండగా నిలుస్తుందని కుంజా ధర్మా స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కుంజా సంతోష్, నిడదవోలు నాగబాబు, పీసీ కేశవ్, గుమ్మల్ల వెంకటేశ్వర్లు (జీవా), బోడ సత్యనారాయణ, జంపాల ప్రభాకర్, గంగులకుర్తి రామాచారి తదితరులు పాల్గొన్నారు.

Tuesday, September 1, 2026

వేద పాఠశాలను తలపిస్తున్న తాత గుడి సెంటర్ ప్రాథమిక పాఠశాల..


 భద్రాచలం తాత గుడి సెంటర్లోని ప్రాథమిక పాఠశాల ప్రాంగణములోనే  ఒకవైపు ప్రాథమిక విద్య మరోక వైపు పూర్వ ప్రాథమిక విద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను చూస్తే అలనాడు అంకిత భావంతో  గ్రామాలకు దూరంగా నిర్వహించిన వేద పాఠశాలను తలపిస్తున్నాయని భద్రాచలం మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేశారు.

 పాఠశాలల పర్యవేక్షణలో భాగంగా మంగళవారం నాడు ఆర్కస్మికంగా ఈ పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి సందర్శించారు.  ఈ పాఠశాల  ప్రాథమిక స్థాయిలో 149 మంది విద్యార్థులు పూర్వ ప్రాథమిక కేంద్రంలో 20 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.

 ఈ పాఠశాలలో ప్రతిరోజు ఎక్సెల్ ప్రోగ్రాం కింద విద్యార్థులు కంప్యూటర్లను వినియోగించుకొని ఆధునిక జ్ఞానాన్ని నేర్చుకోవటం వాటిలోని మెలుకువలను అలవర్చుకొని  వినియోగించుకోవడం  అందరికీ ఆదర్శమని  బెక్కంటి అన్నారు.


 ఈ నేపథ్యంలో బ్యాగ్ లెస్ డే రోజు విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలలో పోటీలను నిర్వహించడం ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థుల్లో అంతర్గత సామర్థ్యాన్ని వెలికి తీయటం  ఒక ప్రత్యేకత సంతరించుకుంది.

 ఇదిలా ఉండగా పూర్వ ప్రాథమిక విద్యలో విద్యార్థులను అంతర్గత సామర్థ్యాలను వెలుగుచూస్తూ పక్కనే ఉన్న ప్రాథమిక విద్యను పరిచయం చేస్తున్న తీరు చూస్తే ప్రతి ఒక్కరు తమ పిల్లలను ఈ పాఠశాలకు పంపించటం తద్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

 ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు తరగతి గదిలో కనీస అభ్యసన సామర్ధ్యాలను సాధించని పిల్లలకు  ప్రత్యేక తరగతులు నిర్వహించి వారిలోని సామర్థ్యాలను అభివృద్ధి పదములో తీసుకురావడం ఈ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం.

 ఒకే ప్రాంగణంలో ఒక పక్క పూర్వ ప్రాథమిక విద్య మరొక పక్క ప్రాథమిక విద్య అనుసంధానం చేసి విద్యార్థులకు తరగతి గదిలో కావలసిన కనీస అభ్యసనా సామర్థ్యాలు సాధించటం ఈ పాఠశాల యొక్క ప్రత్యేకత అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 గ్రామ నడిబడ్డనున్నప్పటికీ పచ్చని వాతావరణంలో చక్కటి విద్యకు శ్రీకారం చుట్టిన పాఠశాల ఉపాధ్యాయులు అందరికీ పేరుపేరునా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

 ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాపారావు పూర్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శిరీష్య సేవలను వారు కొనియాడారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు యోగ, ఆటల పోటీలలో అవగాహన కలిగించటం నైపుణ్యాలను పెంచడం దిన చర్యలో భాగంగా నిర్ణయించటం ఈ పాఠశాల ప్రత్యేకత.

 ఈ కార్యక్రమంలో వీరి వెంట క్లస్టర్ రిసోర్స్ పర్సన్ గోపికృష్ణ తోపాటు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు,స్వచ్ఛ మిత్రా సేవకులు,మధ్యాహ్న భోజన నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.