Saturday, September 5, 2026

ఘనంగా సన్మానించారు


 తెలంగాణా రాష్ట్రప్రభుత్వ విశ్రాంత  ఉద్యోగుల భవనం లో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనం గా జరుపుకున్నారు.డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విశ్రాంత ఉపాధ్యాయులైన ఎన్.ఎస్.అజరయ్య,ఏ.బాలాస్వామి,కె.శేఖర్,పి.సౌదామణి,ఎం.వి.ఎస్.విజయలక్ష్మి ,శోభాకుమారి,ట్.జె.పి.ప్రేమకుమార్,అనసూయ లను శాలువలు,పుష్పగుచ్చాలతో అధ్యక్షులు జి.భూషణరావు ఘనంగా సన్మానించారు.

కార్యదర్శి కె.మధుసూదన రావు,ఫైనాన్స్ సెక్రటరి ఎస్.హనుమంత రావు,అసోసియేట్ అధ్యక్షులు జి.వెంకన్న,వై.రామచంద్ర రావు,కె.ఎం.కుమారి,జి.తులసీదాస్,టి. పాపయ్య,ఏ.శ్రీనివాసరావు,డి.సుబ్బరాజు,జి.భూపతిరావు,ఎం.భాస్కర్ రావు,రఘురామప్రసాద్,గమానియేల్,అన్నపూర్ణ,కె.మనోహర్,రోడాబాయి,శారమ్మ,రాజు.షమ్షుద్దీన్,అప్పారావు,బ్రమ్మేశ్వరరావు తదితరులు ఫాల్గొన్నారు.

భద్రాద్రిలో బహుముఖ ప్రజ్ఞశాలులకు ఘన సన్మానం

 జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం సాయంత్రం స్థానిక మండల విద్యా వనరుల కేంద్రంలో 8 మంది బహుముఖ ప్రజ్ఞాశాలులైన ఉత్తమ ఉపాధ్యాయులను మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘన సన్మానం  నిర్వహించినట్లుగా మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాస్ రావు తెలిపారు.  

 వృత్తిపరంగా ప్రవృత్తి పరంగా, ఉపాధ్యాయ వృత్తిలో అంకిత భావంతో పనిచేసి పలువురు బలహీన బడుగు వర్గాల పిల్లలకు ఆశాజ్యోతి గా నిలిచిన ఉపాధ్యాయులను అన్ని  ఉపాధ్యాయ సంఘాల సమన్వయంతో మండల స్థాయిలో   ఎంపిక చేసి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో, శాలువాలు కప్పి, పూల గుచ్చాలు అందించి, మెమెంటోలు ఇచ్చి, మెడల్ ప్రధానం చేసి ఘన సన్మానాన్ని ఘనంగా నిర్వహించారు.

 ఘన సన్మానాన్ని పొందిన మండల స్థాయి *ఉత్తమ ఉపాధ్యాయులు వీరే...*

బీవీ రత్నకుమారి, SA బైలాజికల్ సైన్స్, జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల భద్రాచలం, కే పుష్ప, SA ఫిజికల్ సైన్స్, జిల్లా పరిషత్ బాలికొన్నత  పాఠశాల, భద్రాచలం, పి నాగమణి, SA సోషల్ స్టడీస్, గవర్నమెంట్ హై స్కూల్ భద్రాచలం, బి జయబాబు, SA బయోలాజికల్ సైన్స్, గవర్నమెంట్ హై స్కూల్ భద్రాచలం, ఎస్ ఎన్ వి  అరుణ కుమారి, SGT, ఎంపీపీ ఎస్ లంబాడి కాలనీ, ఎస్ శ్రీదేవి, SGT, ఎంపీపీ ఎస్ రెవిన్యూ కాలనీ, జి తిరుమల కుమారి, SGT, ఎంపీపీ ఎస్ తాతగుడి  సెంటర్. ఘనంగా సన్మానించి అభినందించారు.

 ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి  బెక్కంటి  శ్రీనివాసరావు మాట్లాడుతూ అవార్డు తీసుకున్న ప్రతి ఉపాధ్యాయుడు మరింత కష్టపడి విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

 ఈ కార్యక్రమంలో మండల ఫోగ్రామ్  కన్వీనర్ గా పనిచేసిన రాజ శ్రీనివాస్ ప్రసంగిస్తూ మండలంలో కష్టపడి అంకిత భావంతో అన్ని రకాలుగా స్వచ్ఛందంగా పనిచేసిన ఉపాధ్యాయులకు నేడు మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం రావడం తమకెంతో ఆనందంగా ఉందని వారి సేవలు భవిష్యత్తులో మరింతగా మెరుగుపరుచుకోవాలని వారికి విజ్ఞప్తి చేశారు.

 ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు కాంప్లెక్స్ ఉపాధ్యాయులు ఆయన జాన్సన్  మాట్లాడుతూ మండల స్థాయిలో గుణాత్మక విద్యను పెంపొందించడానికి కృషిచేసిన ఉపాధ్యాయులను గుర్తించి చక్కటి సన్మానం నిర్వహించినందుకు మండల విద్యాశాఖ అధికారి కి అభినందనలు తెలియజేస్తూ ఉపాధ్యాయులు అందరూ అంకితభావంతో పనిచేయడం ద్వారా మండలాన్ని జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో ఉంచాలని కోరినారు. 

ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్ విజయ్ కుమార్, పిఆర్టియు  మండల ప్రధాన కార్యదర్శి టి రామకృష్ణ, ఏటీఎఫ్ జిల్లా అధ్యక్షులు జయ బాబు, సన్మాన గ్రహీతలు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎం ఆర్ సి సిబ్బంది, మండలంలోని ఉన్నత మరియు మండల పరిషత్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ మోసాలపై ఇంటింటికి తిరిగి బాకీ కార్డుల పంపిణీ

 

అధికారం లోకి వచ్చి 1000 అవుతున్న ఇంక 6 గ్యారంటీలు అమలు చేయకుండా 420 హామీలు ఊసే ఎత్తకుండా ప్రజలను మోసం చేస్తున్న అధికార పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు చర్ల పట్టణంలో పలు వార్డు లలో ఇంటింటికి తిరుగుతూ బాకీ కార్డు లను పంపిణీ చేసిన BRS పార్టీ చర్ల మండల కమిటీ నాయకులు ఈసందర్భంగా కన్వీనర్ దొడ్డి తాతారావు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేస్తామని చెప్పి గద్దెనెక్కి 1000 రోజులు అవుతున్న కనీసం హామీలు అమలుచేయడం లేదు అని పాలన చేతకాక ప్రతిపక్ష నాయకుడు రాజీనామా చేయాలి అని మాట్లాడుతున్నారు అసలు రాజీనామా చేయాల్సింది మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసినందుకు ముందు మీరు రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు

 ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్ యువజన విభాగం నాయకులు కాకి అనిల్ అంబోజి సతీష్ గోరింట్ల వెంకటేశ్వరరావు వార్డ్ మెంబర్ కట్టం కన్నరావు గదేంశెట్టి కిశోర్ తడికల బుల్లేబాయ్ పసికంటి సంతోష్ మరియు స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు

Friday, September 4, 2026

వంట వార్పు మరియు మహిళా నిరసన కార్యక్రమం

 బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపుమేరకు డివిజన్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ మానెం రామకృష్ణ ఆదేశానుసారం ఈ రోజు చర్ల BRS మండల కన్వీనర్ దొడ్డి తాతారావు గారి ఆధ్వర్యంలో చర్ల పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన వంట వార్పు మరియు మహిళా నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భద్రాచలం బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం నాయకుడు మానె రామకృష్ణ గార్లు. 

 ఈ కార్యక్రమంలో మాట్లాడుతు కాంగ్రెస్ 1000 రోజుల పాలనకు నిరసనగా తెలంగాణ రాష్ట్రంలో 2 నుండి 8 వరకు జరుగుతాయి ఎన్నికల్లో 6 గ్యారంటీలు 420 హమీలతో అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో హమీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల అయ్యిన ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదు. అందుకే ఈరోజు మహిళలకు హమీలు అమలు చేయాలని కళ్యాణ్ లక్ష్మి షాదిముబారాక్ కెసిఆర్ కిట్టు విద్యార్థినులకు స్కూటీలు ప్రతీ ఇంటి మహిళకు 2500 ఈ హమీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్.

 ఈ కార్యక్రమంలో చర్ల బిఆర్ఎస్ పార్టీ కో కన్వీనర్ అయినవోలు పవన్ కుమార్ సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్ పంజా రాజు కాకి అనిల్ కొంబత్తిన రాము గోరింట్ల వెంకటేశ్వరరావు అంబోజి సతీష్ తడికల బుల్లెబ్బాయి కుప్పాల నిరంజన్ కుప్పాల సౌజన్య పాసిగంటి సంతోష్ దుబ్బ సమ్మయ్య తడికల చంద్రశేఖర్ కట్టం కన్నారావు గాదం సెట్టి కిషోర్ కుక్క డప్పు సాయి పాసిగంటి సంధ్య మచ్చ రాణి మహిళా సర్పంచులు పెద్ద ముసిలేరు సర్పంచ్ బెండ బోయిన సుహాసిని ఉప్పరిగూడెం సర్పంచ్ సోయం నాగలక్ష్మి కుదునూరు సర్పంచ్ కుంజా కమల మరియు నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు


Thursday, September 3, 2026

రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమం

ఈరోజు కెటిఆర్ ఆదేశాల మేరకు రైతు సమస్యలపై కొత్తపల్లి గ్రామంలో రైతు సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తీవ్ర అన్యాయం చేసిందని బీఆర్‌ఎస్ చర్ల మండల కన్వీనర్ దొడ్డి తాతారావు ఆరోపించారు  రైతు సంక్షేమం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో రైతుల కష్టాలు మరింత పెరిగాయని విమర్శించారు.

రైతు రాజ్యం వస్తుందని ఆశిస్తే రావణ రాజ్యం వచ్చింది అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు

రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోకుండా రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు

రైతు బీమా పథకాన్ని ఎత్తివేసారని  రుణమాఫీ అసంపూర్తి గా చేశారన్నారు.

గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం అమలు చేసిన రైతు బీమా వంటి పథకాలు రైతు కుటుంబాలకు భరోసా కల్పించాయని అన్నారు. 

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బీమా విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు అదే విధంగా రైతులకు హామీ ఇచ్చిన రుణమాఫీ కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు.

 ఎన్నికల సమయంలో రైతులకు సంవత్సరానికి రైతు భరోసా కింద రూ.15 వేల చొప్పున అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.

  పండించిన పంటకు గిట్టుబాటు ధర,సన్న వడ్లకు రూ.500 బోనస్,కౌలు రైతులకు రైతు భరోసా వంటి హామీలు ఇచ్చినా వాటి అమలులో ప్రభుత్వం విఫలమైందని అన్నారు

*కౌలు రైతులకు ఇస్తామన్న భరోసా ఏదని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆ హామీ అమలు పరిస్థితి ఏమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు* 

*ధాన్యం కొనుగోలు కేంద్రాలపై నిర్లక్ష్యం

రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయడం లేదని బీఆర్‌ఎస్ నాయకుడు ఆరోపించారు. ధాన్యం కొనుగోలులో రైతులు ఇబ్బందులు పడుతున్నారని,సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి చివరకు ఒక సీజన్ కు మాత్రమే పరిమితం చేశారని, దాన్ని ఈ సంవత్సరం ఏడు రకాల వడ్ల ను సాగు చేసిన వారికే అంటూ బోనస్‌ను బోగస్‌గా మార్చారని విమర్శించారు.

యూరియా కోసం రైతుల అవస్థలు పడుతున్నారనిప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని  అన్నారు.

పంటల సాగు కీలక దశలో ఎరువులు సకాలంలో అందించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు

యూరియా కోసం యాపులు పెట్టిన రాబందు ప్రభుత్వం అంటూ ఘాటుగా విమర్శించారు. రైతులకు అవసరమైన యూరియాను సకాలంలో, సరిపడా అందించాలని డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ కో కన్వీనర్ అయినవోలు పవన్ కుమార్ కొత్తపల్లి సర్పంచ్ ఉప్పట్ల నాగలక్ష్మి మొగల్లపల్లి ఉపసర్పంచ్ ఎడ్ల రామదాసు నియోజకవర్గ యువజన నాయకులు కాకి అనిల్ పంజా రాజు  మండల మండల నాయకులు సయ్యద్ అజీజ్ బట్ట కొమరయ్య రాట్నాల శ్రీరామ్మూర్తి  యూత్ అధ్యక్ష కార్యదర్శులు అంబోజి సతీష్ కుప్పల నిరంజన్ BC సెల్ అధ్యక్షులు గోరింట్ల వెంకటేశ్వరరావు SC సెల్ అధ్యక్షులు కొంబతీని రాము యువజన నాయకులు తడికల బుల్లేబాయ్ గదేంశెట్టి కిశోర్ కుక్కడపు సాయి మైప వెంకటేశ్వర్లు సాంబ  నాయకులు,కార్యకర్తలు,యువజన నాయకులు,రైతులు పాల్గొన్నారు...

మండల విద్యాధికారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశం

 ఈరోజు స్థానిక మండల విద్యా వనరుల కేంద్రం భద్రాచలం నందు మండల విద్యాధికారి బెక్కంటి శ్రీనివాసరావు   గారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది.

 ఈ సందర్భంగా హాజరైన ఉపాధ్యాయ సంఘాల నాయకులను ఉద్దేశించి మండల విద్యాధికారి మాట్లాడుతూ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల విద్యా వనరుల కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని ఆ కార్యక్రమంలో మండలంలో పాఠశాలల అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తున్న 8 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారిని సన్మానిస్తామని దానికి అన్ని సంఘాల సహాయ సహకారాలు అందించాలని కోరడం జరిగింది. సందర్భంగా ఆయా  నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేయడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో పిఆర్టియు మండల బాధ్యులు టి రామకృష్ణ, బి కృష్ణ, టీఎస్ యుటిఎఫ్ బాధ్యులు ఎస్ విజయ్ కుమార్, కే శ్రీనివాసరావు, పి ఎస్ వి ప్రసాద్ బాబు, ఆట సంఘ నాయకులు కలం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Wednesday, September 2, 2026

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ

 భద్రాచలం మండలం పరిధిలోని లంబాడి కాలనీలో ప్రాథమిక పాఠశాలలో బుధవారం నాడు మండల విద్యాశాఖ అధికారి సందర్శించి వారి చేతులమీదుగా విద్యార్థులందరికీ నూతన యూనిఫామ్ ని పంపిణీ చేశారు.

 అనంతరం ఎంతో ఆనందంగా విద్యార్థులందరూ యూనిఫామ్ ధరించి మండల విద్యాశాఖ అధికారి సమక్షంలో ఉపాధ్యాయులతో ఫోటోలు దిగి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు KNVR జగన్ మోహన్ రావు  ఉపాధ్యాయిని S. అరుణ తోపాటు క్లస్టర్ రిసోర్స్ పర్సన్ గోపికృష్ణ టైలర్ దాసు తోపాటు తదితరులు పాల్గొన్నారు.