Thursday, September 10, 2026

పూల బొకే ఇచ్చి ఆశీర్వదించారు.

గాదె మాధవ రెడ్డి అస్వస్థకు గురై హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో వైద్య సేవలు తీసుకొని భద్రాచలం వచ్చిన సందర్భంగా ఎందరో రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఆత్మీయులు బంధువులు స్నేహితులు అలాగే కళాకారులు. ఉపాధ్యాయులు, మిత్రులు శ్రేయోభిలాషులు, చాలామంది పరామర్శించి ,త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈరోజు కళాబంధు మేము సైతం కళా సేవలో తెలంగాణ సేవా సంస్థ సభ్యులు బెల్లంకొండ దుర్గా కోమలి, మరిగంటి పద్మావతి, కత్తి కనకదుర్గ , జెమిని రామలక్ష్మి, కోట దుర్గాప్రసాద్ అందరికన్నా భిన్నంగా గాదె మాధవరెడ్డి  స్వగృహానికి చేరుకొని వారి యొక్క కవిత్వంతో.. పాటలతో.. అలరించి ఎంతో ప్రేమతో త్వరగా కోలుకోవాలని పూల బొకే ఇచ్చి ఆశీర్వదించారు.

సాయి బాబా స్వర్ణ సింహాసనానికి లక్ష విరాళం

భద్రాచల వాసి ప్రముఖ పర్యావరణ ప్రేమికుడు భద్రాచలం గ్రామాన్ని హరిత భద్రాద్రి గా తీర్చి దిద్దాలని గత 15 స. లు గా వారి బృందం తో కలసి తీవ్రం గా కృషిచేస్తున్న ''వృక్ష మిత్ర '' రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహిత లయన్ డా. గోళ్ళ భూపతి రావు కు ఎన్నో ప్రశంసలు. భద్రాచలం గ్రామం పచ్చదనం తో ఉంది అంటే అత ని పట్టుదల అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు.

 అంతే కాకుండా స్వయం గా దానగు ణం గల వీరు ఎన్నో సేవ కార్యక్రమాలు ని ర్వహిస్తున్నారు. అడిగిన వారికి కాదనకుండా సహయం చేయటం, మొక్కలు పంచడం వీరికి అలవాటు. భద్రాచలం లో ఉన్న దేవాలయాలకు వారి కుమారుడు డాక్టర్ గోళ్ళ వరుణ్ కుమార్ ఎమ్ ,డి , యు. ఎస్. ఏ., వారు కూడా విరాళాలు అందచేశారు. వీరి చిన్నతనం లో స్థాపించిన సాయిబాబా ఆలయం వారికి స్వర్ణ సింహాసనం తయారు నిమిత్తం గోళ్ళ భూపతి రావు, మంజుల రాణి దంపతులు ఒక లక్ష విరాళం అందచేశారు. 

ఈ సందర్బంగా గోళ్ళ భూపతి రావు మాట్లాడుతూ ప్రతి వారు వారి జీవితం లో కొంత భాగం పేదవారికి సహాయం చేయడం అలవాటుగా నేర్చుకోవాలని ఇతరులకు ఆదర్శం గా నిలవాలని తెలియ చేసారు. అదేవిధంగా నా ఈ సమాజ సేవ కార్యక్ర మాలను కొనసాగిస్తూ పర్యావరణ పరిరక్షణకు ఎల్లప్పుడు ముందు వరుసలో ఉంటానని తెలియచేశారు. ఈ కార్యక్రమం లో ఆలయ అధ్యక్షులు శ్రీ ఆదినారాయణ,శ్రీ చా రుగుళ్ల సుబ్బా రావు కోశాధికారి వెంకటేశ్వర రావు, శ్రీ కడలి నాగరాజు మరియు ఆలయ అర్చకులు శ్రీ రామ్ శర్మ తదితరులు పాల్గొన్నారు


విద్యార్థుల ధ్రువపత్రాల జాప్యాన్ని వెంటనే పరిష్కరించాలి


ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, పీజీ ప్రవేశాల ప్రక్రియలు కొనసాగుతున్న వేళ విద్యార్థులకు అవసరమైన కుల, సమగ్ర, ఆదాయ, నివాస ధ్రువపత్రాల జారీలో జరుగుతున్న జాప్యాన్ని వెంటనే పరిష్కరించాలని కోరుతూ భద్రాచలం బీజేపీ ఎస్టీ మోర్చా, యువమోర్చా ఆధ్వర్యంలో భద్రాచలం తహసీల్దార్ వై. రవికుమార్కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా *బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా సంతోష్* మాట్లాడుతూ, మీ సేవ ద్వారా దరఖాస్తు చేసిన అనంతరం సంబంధిత సిబ్బంది పరిశీలన, ఆర్‌ఐ ధృవీకరణ, తహసీల్దార్ స్థాయి ఆమోదం వంటి వివిధ దశల్లో సమన్వయం లోపించడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఉద్యోగ, విద్యా ప్రవేశాల గడువులు సమీపిస్తున్న నేపథ్యంలో *పెండింగ్ దరఖాస్తులను ప్రత్యేకంగా సమీక్షించి, అత్యవసర దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి ధ్రువపత్రాలను త్వరితగతిన జారీ చేయాలని* కోరారు. అలాగే విద్యార్థులు తమ ధ్రువపత్రాల దరఖాస్తు స్థితిని సులభంగా తెలుసుకునేందుకు తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

అదేవిధంగా, *ఉద్యోగం లేదా విద్యా ప్రవేశానికి గడువు ఉన్న విద్యార్థులు* తమ పెండింగ్ ధ్రువపత్రాల వివరాలను బీజేపీ సహాయ కేంద్రానికి పంపితే, వారి దరఖాస్తు స్థితిని సంబంధిత అధికారుల వద్ద తెలుసుకుని, అవసరమైన మేరకు అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఫాలోఅప్ చేస్తామని కుంజా సంతోష్ తెలిపారు.

📱 *వాట్సాప్ సహాయ కేంద్రం: 9866060034*

విద్యార్థులు మీ సేవ దరఖాస్తు సంఖ్య, ధ్రువపత్రం పేరు, దరఖాస్తు తేదీ, ఉద్యోగం/ప్రవేశానికి సంబంధించిన గడువు వివరాలను పై నంబర్‌కు వాట్సాప్ చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో యువమోర్చా నాయకులు ములిశెట్టి నిఖిల్, అన్నెం సాయి లక్ష్మణ్, కిలారు అంజి, గంగులకుర్తి రామాచారి తదితరులు పాల్గొన్నారు. 

 

Tuesday, September 8, 2026

అక్రమ అరెస్ట్ ను ఖండించండి

 

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంఎల్సి తాతమధు అక్రమంగా అరెస్టును చర్ల మండల బిఆర్ యస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు కో కన్వీనర్ ఐనవోలు పవన్ తీవ్రంగా ఖండించారు.

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హమీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రజలకు కోసం ఉద్యమాలు చేస్తుంటే కాంగ్రెస్ చూడ లేక ఓర్వ లేక బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంఎల్సిలను అసెంబ్లీలోకి వెళ్ళనీయకుండా పోలీసులతో కొట్టించడం, కింద పడేసి తొక్కడం మహిళ ఎంఎల్ఏలు అని చూడకుండా మెడ పట్టుకుని తోయడం చీరలు లాగి అవమానించడం చరిత్రలో ఎప్పుడు జరగని ఈ చర్యను చూసి తాతమధు  చేసిన వ్యాఖ్యలను పట్టుకుని ప్రజా సమస్యలకు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. తాతమధు  ఆ సందర్భంలో అన్న మాటలు గౌరవనీయులైన స్పీకర్ గారికి బాధ కలిగించినటైతె తన వ్యాఖ్యలను వెనకకు తీసుకుంటున్నాను అని పత్రిక ముఖం తెలియజేసిన అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులైన మహిళలకే రక్షణ లేక పోతే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం నిన్న మహిళ ఎంఎల్ఏలకు జరిగిన అవమానం తెలంగాణ రాష్ట్ర మహిళలందరికి జరిగిన అవమానం కాబట్టి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆదివాసీ విద్యార్థికి అండగా నిలిచిన భద్రాచలం – MBBS చదువుకు ₹1.20 లక్షల ఆర్థిక సహాయం

 

ములకలపల్లి మండలం, సీతాయిగూడెం గ్రామానికి చెందిన *కోయ ఆదివాసీ విద్యార్థి నక్క సంతోష్* తల్లిదండ్రులు లేకపోయినా, తన కష్టంతో చదువుకుని *NEETలో 424 మార్కులు సాధించి MBBS సీటు* సాధించాడు.

ప్రస్తుతం *Arundathi Institute of Medical Sciences*లో తనకు కేటాయించిన MBBS సీటును కొనసాగించేందుకు *08-09-2026 (మంగళవారం)లోపు ₹1,20,000/-* ఫీజు చెల్లించాల్సి ఉంది.

ఈ విషయాన్ని పత్రికల ద్వారా తెలుసుకున్న *భద్రాచలం ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ బి. రాహుల్ గారు* స్పందించి, నక్క సంతోష్ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని *ITDA ద్వారా ₹60,000/- ఆర్థిక సహాయం* అందించారు.

ఈ సందర్భంగా త్వరితగతిన స్పందించి ఆదివాసీ విద్యార్థికి అండగా నిలిచిన *ITDA PO శ్రీ బి. రాహుల్ గారికి ఆదివాసీ ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.*

🔥🔥 *కేవలం ఒక గంటలోనే ₹60,116/- సమీకరణ!* 🔥🔥

ITDA ద్వారా అందిన ₹60,000/-కు అదనంగా అవసరమైన మిగిలిన మొత్తాన్ని సమీకరించేందుకు ఆదివాసీ నాయకులు, ఉద్యోగులు, దాతలు ముందుకు వచ్చారు.

*కేవలం ఒక గంట సమయంలోనే ₹60,116/-ను* వివిధ దాతల ద్వారా సమీకరించడం జరిగింది.

### 💐 *ఆర్థిక సహాయం అందించిన దాతలు*

1️⃣ *ITDA PO శ్రీ బి. రాహుల్ గారు* – ₹60,000/-

2️⃣ *టి. మధుకర్ గారు, గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్* – ₹11,116/-

3️⃣ *కుంజా ధర్మా గారు (BJP)* – ₹5,000/-

4️⃣ *తెల్లం రమణయ్య & అనురాధ దంపతులు – BCM* – ₹5,000/-

5️⃣ *కుర్సం ఎర్రయ్య & ఎస్. వెంకటలక్ష్మి దంపతులు, ఖమ్మం* – ₹5,000/-

6️⃣ *ఎం. రామకృష్ణా రెడ్డి గారు – DD Office* – ₹5,000/-

7️⃣ *కొండ్రు వీరస్వామి & కొండ్రు సుధారాణి దంపతులు* – ₹2,000/-

8️⃣ *CH. రమణ మూర్తి గారు, Sr. Asst., DD Office* – ₹2,000/-

9️⃣ *ఇర్పా నారాయణ గారు, Sr. Asst., DD Office* – ₹2,000/-

🔟 *బొర్ర రంగయ్య గారు, Jr. Asst., DD Office* – ₹2,000/-

1️⃣1️⃣ *ఈసం అశోక్ గారు, Jr. Asst.* – ₹1,000/-

1️⃣2️⃣ *గలిగ సురేష్ గారు, Jr. Asst., DD Office* – ₹1,000/-

1️⃣3️⃣ *ఎం. ప్రసాద్ గారు, Jr. Asst., DD Office* – ₹1,000/-

1️⃣4️⃣ *డా. ఎం. వీర నాయక్ గారు, PETC Principal* – ₹1,000/-

1️⃣5️⃣ *కోరస ఉమా మహేశ్వరరావు గారు, టీచర్* – ₹1,000/-

1️⃣6️⃣ *పూనెం కృష్ణ గారు, సర్పంచ్, భద్రాచలం* – ₹1,000/-

1️⃣7️⃣ *పాయం రవివర్మ గారు, Advocate* – ₹1,000/-

1️⃣8️⃣ *భవాని గారు, Superintendent, Engineering Section* – ₹3,000/-

💻 *ఆన్‌లైన్ ద్వారా వివిధ దాతల నుంచి – ₹11,000/-*

🔥 *ముఖ్యంగా, నక్క సంతోష్ MBBS అడ్మిషన్ కోసం అవసరమైన ₹60,000/- సమాజం నుంచి సమీకరించాల్సిన లక్ష్యాన్ని కేవలం ఒక గంటలోనే పూర్తి చేయడం జరిగింది.*

🙏 *ఒక ఆదివాసీ బిడ్డ డాక్టర్ కావాలనే కలకు అండగా నిలిచిన ITDA PO శ్రీ బి. రాహుల్ గారికి, ఆదివాసీ నాయకులకు, ఉద్యోగులకు, దాతలకు మరియు ఆన్‌లైన్ ద్వారా సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.*

*ఈ కార్యక్రమంలో భద్రాచలం కోయ కుల సంఘం పటేల్ తెల్లం రమణయ్య, ఆదివాసీ నాయకులు కుంజా ధర్మా, కుంజా సంతోష్, పూనెం వీరభద్రం, గుండు శరత్, పాయం రవివర్మ, పూనెం నాగేశ్వరరావు, కొండ్రు వీరస్వామి, కొండ్రు సుధారాణి, కణితి రాధ, మిడియం నాగమణి తదితరులు పాల్గొన్నారు.* 

 

Sunday, September 6, 2026

చర్ల సంతలో కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ


కాంగ్రెస్ దగాకోరు పరిపాలనలో 6 గ్యారంటీలు 420 ఇచ్చిన హమీలు ప్రభుత్వ వచ్చిన 100 రోజుల్లో నెరవేర్చుతాముఅని చెప్పిన 1000 రోజుల పూర్తి అయిన ఒక్క హమీ కూడా పూర్తిగా అమలు చేయలేదు. వెంటనే అమలు చేయాలని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆదేశాల మేరకు 2 వ తేదీ నుండి 8 తారీఖు వరకు బిఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు బాగంగా 4 రోజులు నిరసన కార్యక్రమాలు విజయవంతం నిర్వహించడం జరిగింది. 

5 రోజు చర్ల సంతలో కాంగ్రెస్ ప్రజలకు బాకిపడ్డా కార్డులు పంపిణీ చేయడం జరిగింది. సంతలో ప్రజలందరూ మళ్లీ కెసిఆర్ ప్రభుత్వం మే వస్తుందని చెప్పడం ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పై ఎంత వెతిరేకత ఉందని చెప్పడానికి నిదర్శనం అని బిఆర్ఎస్ పార్టీ చర్ల మండల కన్వీనర్ తెలియజేసారు. ఇప్పటికైనా ప్రభుత్వం 6 గ్యారంటీలు 420 హమీలు అమలు చేయాలని లేని పక్షంలో నిరంతరం ప్రజల కోసం పోరాటాలు చేస్తామని ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు SD అజీజ్ యడ్ల రామదాసు యూత్ నాయకుడు అంబోజి సతీష్ మెంతుల నాగరాజు పాల్గొన్నారు.

Saturday, September 5, 2026

ఘనంగా సన్మానించారు


 తెలంగాణా రాష్ట్రప్రభుత్వ విశ్రాంత  ఉద్యోగుల భవనం లో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనం గా జరుపుకున్నారు.డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విశ్రాంత ఉపాధ్యాయులైన ఎన్.ఎస్.అజరయ్య,ఏ.బాలాస్వామి,కె.శేఖర్,పి.సౌదామణి,ఎం.వి.ఎస్.విజయలక్ష్మి ,శోభాకుమారి,ట్.జె.పి.ప్రేమకుమార్,అనసూయ లను శాలువలు,పుష్పగుచ్చాలతో అధ్యక్షులు జి.భూషణరావు ఘనంగా సన్మానించారు.

కార్యదర్శి కె.మధుసూదన రావు,ఫైనాన్స్ సెక్రటరి ఎస్.హనుమంత రావు,అసోసియేట్ అధ్యక్షులు జి.వెంకన్న,వై.రామచంద్ర రావు,కె.ఎం.కుమారి,జి.తులసీదాస్,టి. పాపయ్య,ఏ.శ్రీనివాసరావు,డి.సుబ్బరాజు,జి.భూపతిరావు,ఎం.భాస్కర్ రావు,రఘురామప్రసాద్,గమానియేల్,అన్నపూర్ణ,కె.మనోహర్,రోడాబాయి,శారమ్మ,రాజు.షమ్షుద్దీన్,అప్పారావు,బ్రమ్మేశ్వరరావు తదితరులు ఫాల్గొన్నారు.