ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయులందరూ బోధనలో విద్యార్థి కేంద్రంగా చేసుకొని ఎఫ్.ఎల్.ఎన్ తో శ్వాస వీల్చు పీల్చుకొని ఎఫ్. ఎల్.ఏం తో శ్వాస విడిచే అంత ప్రాముఖ్యత తో ప్రాథమిక విద్యా బోధన ఉండాలని మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాసరావు ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
మంగళవారం నాడు భద్రాచలం మండల రిసోర్స్ కేంద్రం లో మండల విద్యాశాఖ అధికారి అధ్యక్షతన ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక, కేజీబీవీ, ఎయిడెడ్ ప్రధానోపాధ్యాయుల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో మండల విద్యాశాఖ అధికారి పాఠశాల స్థాయిలో గుణాత్మకమైన విద్య సాధించడానికి తరగతి గదిలో అభ్యసనా సామర్థ్యాలను విద్యార్థి కేంద్రంగా చేసుకొని ఎలా సాధించాలో సుమారు రెండు గంటల పాటు ప్రధానోపాధ్యాయులు అందరికీ శిక్షణ నిర్వహించారు.
బుధవారం మరియు గురువారం నాడు మండలం లోని కాంప్లెక్స్ స్థాయిలో నిర్వహించే కాంప్లెక్స్ సమావేశాలలో తీసుకోవాల్సిన, పాటించాల్సిన,బోధించాల్సిన పలు అంశాలపై కాంప్లెక్స్ హెడ్మాస్టర్లకు సూచనలు చేశారు.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది మండల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో నమోదు అత్యధికంగా సాధించిన జాన్సన్( గవర్నమెంట్ హై స్కూల్ ), T.రమా( జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల ), రాజా శ్రీనివాస్( మండల ప్రాథమికోన్నత పాఠశాల జగదీష్ కాలనీ), పాపయ్య ( ప్రాథమిక పాఠశాల తాత గుడి సెంటర్ ) ప్రధానోపాధ్యాయులకు ఘన సన్మానాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సి ఆర్ పి లు గోపి, ఆర్ కె, సిసి బేబీ, ఐ ఈ ఆర్ పి S. పద్మ మరియు ఏ పి ఎం తదితరులు పాల్గొన్నారు.










