Wednesday, August 12, 2026

ఆదివాసీ యువకుడు చర్ప రాంబాబుకు ఘన సన్మానం

భద్రాచలం,ఆగస్ట్ 12: భద్రాచలంకు చెందిన ఆదివాసీ యువకుడు, డిపో యూత్ సభ్యుడు, మైనారిటీ గురుకుల పాఠశాలలో PETగా పనిచేస్తున్న చర్ప రాంబాబు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో భాగస్వామ్యమై అరుదైన ఘనత సాధించారు.

హైదరాబాద్‌లో 25 ఏప్రిల్ 2026న నిర్వహించిన అతిపెద్ద కరాటే ప్రదర్శనలో మొత్తం 1,212 మంది పాల్గొనగా, విజన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, జె.ఆర్. ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. ఈ కార్యక్రమంలో చర్ప రాంబాబు కూడా పాల్గొని ఈ ప్రతిష్ఠాత్మక రికార్డులో భాగస్వామి అయ్యారు.

ఈ సందర్భంగా డిపో యూత్ ఆధ్వర్యంలో చర్ప రాంబాబును శాలువాతో సత్కరించి, మెమెంటో అందజేసి ఘనంగా అభినందించారు. ఆదివాసీ యువకుడిగా తన ప్రతిభను క్రీడా రంగంలో చాటుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

చర్ప రాంబాబు సాధించిన ఈ విజయం భద్రాచలం ప్రాంత యువతకు, ముఖ్యంగా ఆదివాసీ యువతకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో క్రీడలు మరియు ఇతర రంగాల్లో ముందుకు సాగితే యువత అంతర్జాతీయ స్థాయిలో కూడా తమ ప్రతిభను చాటుకోవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా సంతోష్, టీయుడబ్ల్యూజె భద్రాచలం పట్టణ అధ్యక్షుడు విజ్జగిరి రాజా కిరణ్, డిపో యూత్ సభ్యులు పండా అమృతరావు (అంబు), తాళ్ళ నాగరాజు, శీలం నాగరాజు, తాళ్ళ శివ, కారం రవితేజ, డిపో సత్తి, ప్రసాద్ తదితరులు పాల్గొని చర్ప రాంబాబుకు అభినందనలు తెలిపారు.


శ్రమజీవన సౌందర్యం

 సోమవారం ఉదయం మాదంపతులం ఇరువురం హన్మకొండ నుండి మా పెద్దమ్మాయి, అల్లుడు వాళ్ళతో కలిసి కారులో హైదరాబాద్ వెళుతూ మార్గమధ్యంలో పెంబర్తి ఊరిబయట వున్న హోటల్ ఆర్.ఆర్.లో కాఫీ, ఫలహారాలకోసం ఆగాము. 

పై ఫొటోలో కన్పిస్తున్న వ్యక్తి 

ఆ హోటల్ ముందు ట్రాపిక్ కంట్రోలర్ &  సెక్యూరిటీగార్డ్ కూడా పనిచేస్తూ కనిపించాడు. అతణ్ణి గమనించిన నేను వెంటనే నాకు పెసరట్టు కావాలని చెప్పి,అది వచ్చేలోపు అతని దగ్గరికెళ్ళి ముచ్చట పెట్టాలనుకున్నాను. వెళ్ళి పలకరించాను. 

తన పేరు నాగయ్య. ఊరు పెంబర్తి సమీపగ్రామమైన మాణిక్యపురం  వాళ్ళ స్వగ్రామమట. వాళ్ళు రజక సామాజికవర్గానికి చెందినవారట. తన వయసు యాభై తొమ్మిదో, అరవై ఏండ్లో వుంటాయట. తను చదువుకోలేదట. నాగయ్య దంపతులకు సంతానంలేదట. ఉండటానికి స్వంత ఇల్లు తప్ప వేరే ఆస్తిపాస్తులేమీ లేవట. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరేవుంటార. 

“మరి సంతానం కలిగేఅవకాశం లేనప్పుడు ఏ అనాథబిడ్డనో తెచ్చుకుని సాదుకోపోయారా?”

అంటూ అడిగాను. దానికతను “దేవుడే మానొసటన సంతుకలగాలని రాయనప్పుడు  మళ్ళా అటువంటి ప్రయత్నాలెందుకులెమ్మని వద్దనుకున్నాము” అంటూ బదులిచ్చాడు నాగయ్య. 

“మరి వృద్దాప్యంలో ఎలా” అంటూ అడిగితే “ఈరోజుల్లో కొడుకులు, బిడ్డలున్నోళ్ళందరికీ ముసలి తనంలో పిల్లలు బువ్వబెట్టి మంచి చెడ్డ చూసుకుంటరా? అట్లా  నమ్మేరోజులెప్పుడోపోయినై. 

మా ఆలుమగలిద్దరం ఒకరికొకరం పిల్లలం. మా కాళ్ళు రెక్కలే మా ఆస్తిపాస్తులు. ఎవరం ముందో? ఎవరం ఎనకో ఎవరికెరుక? ముందు పొయినోళ్ళం అదృష్టవంతులం.  ఎనక పోయి నోళ్ళను  ముందలబడి ఎవడు మట్టిల కప్పెడతడో? వాడే వున్న ఇల్లు తీసుకుంటాడు” అంటూ భవిష్యత్తు పట్ల తమ దంపతుల ఆలోచన ఏంటో నింపాదిగా చెప్పుకొచ్చాడు. 

వాళ్ళ ఊర్లో సుమారు రెండవందల మందిదాకా చాలా ఏండ్లుగా ఉప్పర పని మీదనే బతుకులు ఎల్లదీస్తున్నారట! నాగయ్య దంపతులుకూడా మొదటి నుండి వాళ్ళతోపాటు 

ఆ ఉప్పర పన్లకు వెళ్ళేవారట. 

రాను రానూ ఆపని కష్టంగా అనిపించడంతో ఐదు మాసాల క్రితం ఈ హోటల్లో ఆలుమగలిద్దరూ నెలజీతాలకు కుదిరారట. వాళ్ళావిడ క్లీనర్ గా చేస్తుంది.

ఆహోటల్ ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కేవలం కాఫీ, ఫలహారాలను మాత్రమే సర్వ్ చేస్తుందట. ఒంటి గంట తర్వాత క్లోజ్ ఐపోతుందట.

దాంతో స్టాప్ అందరితోపాటు వాళ్ళూ ఇంటికి వెళ్ళిపోతారట.

హోటల్ వాళ్ళు ఇద్దరికీ ఒకపూట టిఫిన్ పెట్టి నెలకు చెరో పదివేలు ఇస్తున్నారట. ఒకరివి ఖర్చు పెట్టుకొని, ఒకరివి వెనుకేసుకుంటున్నారట!

తనింకేదో చెప్పబోతుండగా “ఫలహారం వచ్చింది” రమ్మంటూ అల్లుడు పిలవడంతో నాగయ్య దగ్గర శలవుతీసుకుని ఫలహారశాల లోపలికి వెళ్ళిపోయాను.

మిత్రులకు శ్రమజీవన సౌందర్య అవగాహనానుభవ ప్రమోదోదయం!

                                                                                         --- శిరంశెట్టి కాంతారావు



Tuesday, August 11, 2026

సమీక్ష సమావేశం

 భద్రాచలం,ఆగస్ట్ 11 : ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలపై ఆదివాసీ సంఘాల ఐక్య వేదిక భద్రాచలం ఆధ్వర్యంలో ట్రైబల్ మ్యూజియంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దినోత్సవ కార్యక్రమాల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన వివిధ కమిటీల సభ్యులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ర్యాలీ, సభ, భోజన సదుపాయాలు, ఇతర ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో చోటుచేసుకున్న చిన్నచిన్న లోపాలను గుర్తించి, వాటిని సవరించుకుంటూ ప్రతి సంవత్సరం ఆదివాసీల ఆత్మగౌరవ దినోత్సవాన్ని మరింత ఘనంగా, విజయవంతంగా నిర్వహించాలని నిర్ణయించారు.

అదేవిధంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన భద్రాచలం ఎమ్మెల్యే శ్రీ తెల్లం వెంకట్రావు, భద్రాచలం సర్పంచ్ శ్రీ పూనెం కృష్ణ, భద్రాచలం ఐటీడీఏ పీఓ శ్రీ రాహుల్, ఏపీఓ శ్రీ డేవిడ్ రాజ్ లకు, సంబంధిత అధికారులకు కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

నవంబర్ 15న బిర్సా ముండా, సోయం గంగులు విగ్రహాల ఏర్పాటు

తదుపరి కార్యక్రమాల్లో భాగంగా నవంబర్ 15న భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా జనజాతీయ గౌరవ్ దివస్‌ను ఘనంగా నిర్వహించడంతో పాటు, భద్రాచలం బ్రిడ్జి సెంటర్‌లో బిర్సా ముండా విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆదివాసీ ఐక్య సంఘాల వేదిక ప్రకటించింది.

అదే రోజు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, దమ్మపేట ప్రాంతానికి చెందిన ఆదివాసీ ముద్దుబిడ్డ కోయ బెబ్బులి సోయం గంగులు విగ్రహాన్ని భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లోని ఆదివాసీ యోధుల విగ్రహాల పక్కన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఆదివాసీ చరిత్ర, పోరాట యోధుల త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాలను నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.

ఈ సమావేశంలో ఆదివాసీ సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ తెల్లం రమణయ్య, కో-కన్వీనర్ ముర్ల రమేష్, నాయకులు కుంజా ధర్మా, పూనెం వీరభద్రం, గుండు శరత్, వీసాల కృష్ణయ్య, కొండ్రు వీరస్వామి, నిట్టా రాజు, కుంజా శ్రీను, కుంజా సంతోష్, కోర్సా చినబాబు దొర, చింతా అరుణ, వర్ష వసంత్, వీసాల ఉమాదేవి, కుంజా బేబీ రాణి తదితరులు పాల్గొన్నారు.

Sunday, January 5, 2025

Philanthropic Venture

 Chippa Srinivas and Satyavati, the couple who settled at Hyderabad donated two cycles of Hero brand to the Vanavasi kalyana parishat (Komaram Bhim vidhyarti nilayam) located at Charla.

 The donation has been made by them on the occasion of birthday of their offspring named Mani deep and Tej deep. Total worth of them is Rs.13,000/- and honorary adviser BVSL Narasimha Rao asked that Pupil should take the opportunity of donations for their upliftment. 

 And he congratulated the donors in the event held on the occasion.Chippa Narasimha murthy handed over the cycles to Gondi Shobhan Babu (Prachanda pramukh).Javvadi Muralikrishna (vice-president), Vemulapalli Praveen (Treasurer), Gondi Prasanna kumari (Nilaya pramukh) and inmates of Vanavasi Nilayam attended.


#philanthropic #venture #vanavasikalyana #parishat