కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత విధానాలు, నిర్లక్ష్య వైఖరి వల్లే పేదింటి ఆడపిల్లలకు ఆసరాగా నిలిచే ‘కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్’ పథకాలపై హైకోర్టు స్టే విధించే పరిస్థితి వచ్చిందని బి ఆర్ ఎస్ పార్టీ చర్ల మండల కన్వీనర్ దొడ్డి తాతారావు అన్నారు.
పేద వర్గాలకు ఈ పథకాల ఫలాలు అందకూడదనే దుర్బుద్ధితో, బడ్జెట్ నిధులను ఎగ్గొట్టాలనే కుట్రతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలని కోర్టు వ్యవహారాల్లో అలసత్వం వహిస్తోందని దొడ్డి తాతారావు ఆరోపించారు హైకోర్టులో దాఖలైన పిటిషన్పై స్పందిస్తూ, విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేస్తామని స్వయంగా అడ్వొకేట్ జనరల్ తెలిపినప్పటికీ... న్యాయస్థానం పలుమార్లు అవకాశమిచ్చినా ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ సమర్పించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ తీవ్ర బాధ్యతారాహిత్యానికి ప్రత్యక్ష నిదర్శనమని మండిపడ్డారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఆర్థిక సాయంతో పాటు అదనంగా "తులం బంగారం" ఇస్తామని రంగుల హామీలు ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక ఆ తులం బంగారం ఇవ్వకపోగా కేసీఆర్ గారి హయాంలో ప్రజాదరణ పొందిన ఈ మహత్తర పథకాలను పూర్తిగా రూపుమాపేందుకు నాటకాలకు తెరలేపిందని అన్నారు
2014 నుంచి బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ నాయకత్వంలో పేద కుటుంబాలలోని యువతుల వివాహ ఖర్చుల భారాన్ని తగ్గించి, ఆర్థికంగా ఆదుకోవడానికి 'కల్యాణ లక్ష్మి', 'షాదీ ముబారక్' పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు.
నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన లక్షలాది మంది ఆడబిడ్డల పెళ్లిళ్లకు కొండంత అండగా నిలుస్తూ, ప్రతి ఏటా సగటున రూ. 1,400 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించి వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించామని అన్నారు
ప్రభుత్వం ఇప్పటికైనా నిద్రమత్తు వీడి, తదుపరి విచారణ గడువైన సెప్టెంబరు 9 లోగా ఉన్నత న్యాయస్థానంలో బలమైన కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలి.
అవసరమైతే చట్టసభల ద్వారా ఈ పథకాలకు ప్రత్యేక చట్టబద్ధత కల్పించి, కోర్టు స్టే ఎత్తివేసేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి పెండింగ్లో ఉన్న లబ్ధిదారులందరికీ వెంటనే ఆర్థిక సాయం నిధులను విడుదల చేయాలిఅన్నారు.







