Tuesday, September 8, 2026

అక్రమ అరెస్ట్ ను ఖండించండి

 

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంఎల్సి తాతమధు అక్రమంగా అరెస్టును చర్ల మండల బిఆర్ యస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు కో కన్వీనర్ ఐనవోలు పవన్ తీవ్రంగా ఖండించారు.

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హమీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రజలకు కోసం ఉద్యమాలు చేస్తుంటే కాంగ్రెస్ చూడ లేక ఓర్వ లేక బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంఎల్సిలను అసెంబ్లీలోకి వెళ్ళనీయకుండా పోలీసులతో కొట్టించడం, కింద పడేసి తొక్కడం మహిళ ఎంఎల్ఏలు అని చూడకుండా మెడ పట్టుకుని తోయడం చీరలు లాగి అవమానించడం చరిత్రలో ఎప్పుడు జరగని ఈ చర్యను చూసి తాతమధు  చేసిన వ్యాఖ్యలను పట్టుకుని ప్రజా సమస్యలకు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. తాతమధు  ఆ సందర్భంలో అన్న మాటలు గౌరవనీయులైన స్పీకర్ గారికి బాధ కలిగించినటైతె తన వ్యాఖ్యలను వెనకకు తీసుకుంటున్నాను అని పత్రిక ముఖం తెలియజేసిన అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులైన మహిళలకే రక్షణ లేక పోతే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం నిన్న మహిళ ఎంఎల్ఏలకు జరిగిన అవమానం తెలంగాణ రాష్ట్ర మహిళలందరికి జరిగిన అవమానం కాబట్టి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆదివాసీ విద్యార్థికి అండగా నిలిచిన భద్రాచలం – MBBS చదువుకు ₹1.20 లక్షల ఆర్థిక సహాయం

 

ములకలపల్లి మండలం, సీతాయిగూడెం గ్రామానికి చెందిన *కోయ ఆదివాసీ విద్యార్థి నక్క సంతోష్* తల్లిదండ్రులు లేకపోయినా, తన కష్టంతో చదువుకుని *NEETలో 424 మార్కులు సాధించి MBBS సీటు* సాధించాడు.

ప్రస్తుతం *Arundathi Institute of Medical Sciences*లో తనకు కేటాయించిన MBBS సీటును కొనసాగించేందుకు *08-09-2026 (మంగళవారం)లోపు ₹1,20,000/-* ఫీజు చెల్లించాల్సి ఉంది.

ఈ విషయాన్ని పత్రికల ద్వారా తెలుసుకున్న *భద్రాచలం ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ బి. రాహుల్ గారు* స్పందించి, నక్క సంతోష్ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని *ITDA ద్వారా ₹60,000/- ఆర్థిక సహాయం* అందించారు.

ఈ సందర్భంగా త్వరితగతిన స్పందించి ఆదివాసీ విద్యార్థికి అండగా నిలిచిన *ITDA PO శ్రీ బి. రాహుల్ గారికి ఆదివాసీ ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.*

🔥🔥 *కేవలం ఒక గంటలోనే ₹60,116/- సమీకరణ!* 🔥🔥

ITDA ద్వారా అందిన ₹60,000/-కు అదనంగా అవసరమైన మిగిలిన మొత్తాన్ని సమీకరించేందుకు ఆదివాసీ నాయకులు, ఉద్యోగులు, దాతలు ముందుకు వచ్చారు.

*కేవలం ఒక గంట సమయంలోనే ₹60,116/-ను* వివిధ దాతల ద్వారా సమీకరించడం జరిగింది.

### 💐 *ఆర్థిక సహాయం అందించిన దాతలు*

1️⃣ *ITDA PO శ్రీ బి. రాహుల్ గారు* – ₹60,000/-

2️⃣ *టి. మధుకర్ గారు, గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్* – ₹11,116/-

3️⃣ *కుంజా ధర్మా గారు (BJP)* – ₹5,000/-

4️⃣ *తెల్లం రమణయ్య & అనురాధ దంపతులు – BCM* – ₹5,000/-

5️⃣ *కుర్సం ఎర్రయ్య & ఎస్. వెంకటలక్ష్మి దంపతులు, ఖమ్మం* – ₹5,000/-

6️⃣ *ఎం. రామకృష్ణా రెడ్డి గారు – DD Office* – ₹5,000/-

7️⃣ *కొండ్రు వీరస్వామి & కొండ్రు సుధారాణి దంపతులు* – ₹2,000/-

8️⃣ *CH. రమణ మూర్తి గారు, Sr. Asst., DD Office* – ₹2,000/-

9️⃣ *ఇర్పా నారాయణ గారు, Sr. Asst., DD Office* – ₹2,000/-

🔟 *బొర్ర రంగయ్య గారు, Jr. Asst., DD Office* – ₹2,000/-

1️⃣1️⃣ *ఈసం అశోక్ గారు, Jr. Asst.* – ₹1,000/-

1️⃣2️⃣ *గలిగ సురేష్ గారు, Jr. Asst., DD Office* – ₹1,000/-

1️⃣3️⃣ *ఎం. ప్రసాద్ గారు, Jr. Asst., DD Office* – ₹1,000/-

1️⃣4️⃣ *డా. ఎం. వీర నాయక్ గారు, PETC Principal* – ₹1,000/-

1️⃣5️⃣ *కోరస ఉమా మహేశ్వరరావు గారు, టీచర్* – ₹1,000/-

1️⃣6️⃣ *పూనెం కృష్ణ గారు, సర్పంచ్, భద్రాచలం* – ₹1,000/-

1️⃣7️⃣ *పాయం రవివర్మ గారు, Advocate* – ₹1,000/-

1️⃣8️⃣ *భవాని గారు, Superintendent, Engineering Section* – ₹3,000/-

💻 *ఆన్‌లైన్ ద్వారా వివిధ దాతల నుంచి – ₹11,000/-*

🔥 *ముఖ్యంగా, నక్క సంతోష్ MBBS అడ్మిషన్ కోసం అవసరమైన ₹60,000/- సమాజం నుంచి సమీకరించాల్సిన లక్ష్యాన్ని కేవలం ఒక గంటలోనే పూర్తి చేయడం జరిగింది.*

🙏 *ఒక ఆదివాసీ బిడ్డ డాక్టర్ కావాలనే కలకు అండగా నిలిచిన ITDA PO శ్రీ బి. రాహుల్ గారికి, ఆదివాసీ నాయకులకు, ఉద్యోగులకు, దాతలకు మరియు ఆన్‌లైన్ ద్వారా సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.*

*ఈ కార్యక్రమంలో భద్రాచలం కోయ కుల సంఘం పటేల్ తెల్లం రమణయ్య, ఆదివాసీ నాయకులు కుంజా ధర్మా, కుంజా సంతోష్, పూనెం వీరభద్రం, గుండు శరత్, పాయం రవివర్మ, పూనెం నాగేశ్వరరావు, కొండ్రు వీరస్వామి, కొండ్రు సుధారాణి, కణితి రాధ, మిడియం నాగమణి తదితరులు పాల్గొన్నారు.* 

 

Sunday, September 6, 2026

చర్ల సంతలో కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ


కాంగ్రెస్ దగాకోరు పరిపాలనలో 6 గ్యారంటీలు 420 ఇచ్చిన హమీలు ప్రభుత్వ వచ్చిన 100 రోజుల్లో నెరవేర్చుతాముఅని చెప్పిన 1000 రోజుల పూర్తి అయిన ఒక్క హమీ కూడా పూర్తిగా అమలు చేయలేదు. వెంటనే అమలు చేయాలని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆదేశాల మేరకు 2 వ తేదీ నుండి 8 తారీఖు వరకు బిఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు బాగంగా 4 రోజులు నిరసన కార్యక్రమాలు విజయవంతం నిర్వహించడం జరిగింది. 

5 రోజు చర్ల సంతలో కాంగ్రెస్ ప్రజలకు బాకిపడ్డా కార్డులు పంపిణీ చేయడం జరిగింది. సంతలో ప్రజలందరూ మళ్లీ కెసిఆర్ ప్రభుత్వం మే వస్తుందని చెప్పడం ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పై ఎంత వెతిరేకత ఉందని చెప్పడానికి నిదర్శనం అని బిఆర్ఎస్ పార్టీ చర్ల మండల కన్వీనర్ తెలియజేసారు. ఇప్పటికైనా ప్రభుత్వం 6 గ్యారంటీలు 420 హమీలు అమలు చేయాలని లేని పక్షంలో నిరంతరం ప్రజల కోసం పోరాటాలు చేస్తామని ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు SD అజీజ్ యడ్ల రామదాసు యూత్ నాయకుడు అంబోజి సతీష్ మెంతుల నాగరాజు పాల్గొన్నారు.

Saturday, September 5, 2026

ఘనంగా సన్మానించారు


 తెలంగాణా రాష్ట్రప్రభుత్వ విశ్రాంత  ఉద్యోగుల భవనం లో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనం గా జరుపుకున్నారు.డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విశ్రాంత ఉపాధ్యాయులైన ఎన్.ఎస్.అజరయ్య,ఏ.బాలాస్వామి,కె.శేఖర్,పి.సౌదామణి,ఎం.వి.ఎస్.విజయలక్ష్మి ,శోభాకుమారి,ట్.జె.పి.ప్రేమకుమార్,అనసూయ లను శాలువలు,పుష్పగుచ్చాలతో అధ్యక్షులు జి.భూషణరావు ఘనంగా సన్మానించారు.

కార్యదర్శి కె.మధుసూదన రావు,ఫైనాన్స్ సెక్రటరి ఎస్.హనుమంత రావు,అసోసియేట్ అధ్యక్షులు జి.వెంకన్న,వై.రామచంద్ర రావు,కె.ఎం.కుమారి,జి.తులసీదాస్,టి. పాపయ్య,ఏ.శ్రీనివాసరావు,డి.సుబ్బరాజు,జి.భూపతిరావు,ఎం.భాస్కర్ రావు,రఘురామప్రసాద్,గమానియేల్,అన్నపూర్ణ,కె.మనోహర్,రోడాబాయి,శారమ్మ,రాజు.షమ్షుద్దీన్,అప్పారావు,బ్రమ్మేశ్వరరావు తదితరులు ఫాల్గొన్నారు.

భద్రాద్రిలో బహుముఖ ప్రజ్ఞశాలులకు ఘన సన్మానం

 జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం సాయంత్రం స్థానిక మండల విద్యా వనరుల కేంద్రంలో 8 మంది బహుముఖ ప్రజ్ఞాశాలులైన ఉత్తమ ఉపాధ్యాయులను మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘన సన్మానం  నిర్వహించినట్లుగా మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాస్ రావు తెలిపారు.  

 వృత్తిపరంగా ప్రవృత్తి పరంగా, ఉపాధ్యాయ వృత్తిలో అంకిత భావంతో పనిచేసి పలువురు బలహీన బడుగు వర్గాల పిల్లలకు ఆశాజ్యోతి గా నిలిచిన ఉపాధ్యాయులను అన్ని  ఉపాధ్యాయ సంఘాల సమన్వయంతో మండల స్థాయిలో   ఎంపిక చేసి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో, శాలువాలు కప్పి, పూల గుచ్చాలు అందించి, మెమెంటోలు ఇచ్చి, మెడల్ ప్రధానం చేసి ఘన సన్మానాన్ని ఘనంగా నిర్వహించారు.

 ఘన సన్మానాన్ని పొందిన మండల స్థాయి *ఉత్తమ ఉపాధ్యాయులు వీరే...*

బీవీ రత్నకుమారి, SA బైలాజికల్ సైన్స్, జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల భద్రాచలం, కే పుష్ప, SA ఫిజికల్ సైన్స్, జిల్లా పరిషత్ బాలికొన్నత  పాఠశాల, భద్రాచలం, పి నాగమణి, SA సోషల్ స్టడీస్, గవర్నమెంట్ హై స్కూల్ భద్రాచలం, బి జయబాబు, SA బయోలాజికల్ సైన్స్, గవర్నమెంట్ హై స్కూల్ భద్రాచలం, ఎస్ ఎన్ వి  అరుణ కుమారి, SGT, ఎంపీపీ ఎస్ లంబాడి కాలనీ, ఎస్ శ్రీదేవి, SGT, ఎంపీపీ ఎస్ రెవిన్యూ కాలనీ, జి తిరుమల కుమారి, SGT, ఎంపీపీ ఎస్ తాతగుడి  సెంటర్. ఘనంగా సన్మానించి అభినందించారు.

 ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి  బెక్కంటి  శ్రీనివాసరావు మాట్లాడుతూ అవార్డు తీసుకున్న ప్రతి ఉపాధ్యాయుడు మరింత కష్టపడి విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

 ఈ కార్యక్రమంలో మండల ఫోగ్రామ్  కన్వీనర్ గా పనిచేసిన రాజ శ్రీనివాస్ ప్రసంగిస్తూ మండలంలో కష్టపడి అంకిత భావంతో అన్ని రకాలుగా స్వచ్ఛందంగా పనిచేసిన ఉపాధ్యాయులకు నేడు మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం రావడం తమకెంతో ఆనందంగా ఉందని వారి సేవలు భవిష్యత్తులో మరింతగా మెరుగుపరుచుకోవాలని వారికి విజ్ఞప్తి చేశారు.

 ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు కాంప్లెక్స్ ఉపాధ్యాయులు ఆయన జాన్సన్  మాట్లాడుతూ మండల స్థాయిలో గుణాత్మక విద్యను పెంపొందించడానికి కృషిచేసిన ఉపాధ్యాయులను గుర్తించి చక్కటి సన్మానం నిర్వహించినందుకు మండల విద్యాశాఖ అధికారి కి అభినందనలు తెలియజేస్తూ ఉపాధ్యాయులు అందరూ అంకితభావంతో పనిచేయడం ద్వారా మండలాన్ని జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో ఉంచాలని కోరినారు. 

ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్ విజయ్ కుమార్, పిఆర్టియు  మండల ప్రధాన కార్యదర్శి టి రామకృష్ణ, ఏటీఎఫ్ జిల్లా అధ్యక్షులు జయ బాబు, సన్మాన గ్రహీతలు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎం ఆర్ సి సిబ్బంది, మండలంలోని ఉన్నత మరియు మండల పరిషత్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ మోసాలపై ఇంటింటికి తిరిగి బాకీ కార్డుల పంపిణీ

 

అధికారం లోకి వచ్చి 1000 అవుతున్న ఇంక 6 గ్యారంటీలు అమలు చేయకుండా 420 హామీలు ఊసే ఎత్తకుండా ప్రజలను మోసం చేస్తున్న అధికార పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు చర్ల పట్టణంలో పలు వార్డు లలో ఇంటింటికి తిరుగుతూ బాకీ కార్డు లను పంపిణీ చేసిన BRS పార్టీ చర్ల మండల కమిటీ నాయకులు ఈసందర్భంగా కన్వీనర్ దొడ్డి తాతారావు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేస్తామని చెప్పి గద్దెనెక్కి 1000 రోజులు అవుతున్న కనీసం హామీలు అమలుచేయడం లేదు అని పాలన చేతకాక ప్రతిపక్ష నాయకుడు రాజీనామా చేయాలి అని మాట్లాడుతున్నారు అసలు రాజీనామా చేయాల్సింది మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసినందుకు ముందు మీరు రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు

 ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్ యువజన విభాగం నాయకులు కాకి అనిల్ అంబోజి సతీష్ గోరింట్ల వెంకటేశ్వరరావు వార్డ్ మెంబర్ కట్టం కన్నరావు గదేంశెట్టి కిశోర్ తడికల బుల్లేబాయ్ పసికంటి సంతోష్ మరియు స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు

Friday, September 4, 2026

వంట వార్పు మరియు మహిళా నిరసన కార్యక్రమం

 బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపుమేరకు డివిజన్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ మానెం రామకృష్ణ ఆదేశానుసారం ఈ రోజు చర్ల BRS మండల కన్వీనర్ దొడ్డి తాతారావు గారి ఆధ్వర్యంలో చర్ల పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన వంట వార్పు మరియు మహిళా నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భద్రాచలం బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం నాయకుడు మానె రామకృష్ణ గార్లు. 

 ఈ కార్యక్రమంలో మాట్లాడుతు కాంగ్రెస్ 1000 రోజుల పాలనకు నిరసనగా తెలంగాణ రాష్ట్రంలో 2 నుండి 8 వరకు జరుగుతాయి ఎన్నికల్లో 6 గ్యారంటీలు 420 హమీలతో అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో హమీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల అయ్యిన ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదు. అందుకే ఈరోజు మహిళలకు హమీలు అమలు చేయాలని కళ్యాణ్ లక్ష్మి షాదిముబారాక్ కెసిఆర్ కిట్టు విద్యార్థినులకు స్కూటీలు ప్రతీ ఇంటి మహిళకు 2500 ఈ హమీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్.

 ఈ కార్యక్రమంలో చర్ల బిఆర్ఎస్ పార్టీ కో కన్వీనర్ అయినవోలు పవన్ కుమార్ సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్ పంజా రాజు కాకి అనిల్ కొంబత్తిన రాము గోరింట్ల వెంకటేశ్వరరావు అంబోజి సతీష్ తడికల బుల్లెబ్బాయి కుప్పాల నిరంజన్ కుప్పాల సౌజన్య పాసిగంటి సంతోష్ దుబ్బ సమ్మయ్య తడికల చంద్రశేఖర్ కట్టం కన్నారావు గాదం సెట్టి కిషోర్ కుక్క డప్పు సాయి పాసిగంటి సంధ్య మచ్చ రాణి మహిళా సర్పంచులు పెద్ద ముసిలేరు సర్పంచ్ బెండ బోయిన సుహాసిని ఉప్పరిగూడెం సర్పంచ్ సోయం నాగలక్ష్మి కుదునూరు సర్పంచ్ కుంజా కమల మరియు నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు