Tuesday, September 1, 2026

వేద పాఠశాలను తలపిస్తున్న తాత గుడి సెంటర్ ప్రాథమిక పాఠశాల..


 భద్రాచలం తాత గుడి సెంటర్లోని ప్రాథమిక పాఠశాల ప్రాంగణములోనే  ఒకవైపు ప్రాథమిక విద్య మరోక వైపు పూర్వ ప్రాథమిక విద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను చూస్తే అలనాడు అంకిత భావంతో  గ్రామాలకు దూరంగా నిర్వహించిన వేద పాఠశాలను తలపిస్తున్నాయని భద్రాచలం మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేశారు.

 పాఠశాలల పర్యవేక్షణలో భాగంగా మంగళవారం నాడు ఆర్కస్మికంగా ఈ పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి సందర్శించారు.  ఈ పాఠశాల  ప్రాథమిక స్థాయిలో 149 మంది విద్యార్థులు పూర్వ ప్రాథమిక కేంద్రంలో 20 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.

 ఈ పాఠశాలలో ప్రతిరోజు ఎక్సెల్ ప్రోగ్రాం కింద విద్యార్థులు కంప్యూటర్లను వినియోగించుకొని ఆధునిక జ్ఞానాన్ని నేర్చుకోవటం వాటిలోని మెలుకువలను అలవర్చుకొని  వినియోగించుకోవడం  అందరికీ ఆదర్శమని  బెక్కంటి అన్నారు.


 ఈ నేపథ్యంలో బ్యాగ్ లెస్ డే రోజు విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలలో పోటీలను నిర్వహించడం ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థుల్లో అంతర్గత సామర్థ్యాన్ని వెలికి తీయటం  ఒక ప్రత్యేకత సంతరించుకుంది.

 ఇదిలా ఉండగా పూర్వ ప్రాథమిక విద్యలో విద్యార్థులను అంతర్గత సామర్థ్యాలను వెలుగుచూస్తూ పక్కనే ఉన్న ప్రాథమిక విద్యను పరిచయం చేస్తున్న తీరు చూస్తే ప్రతి ఒక్కరు తమ పిల్లలను ఈ పాఠశాలకు పంపించటం తద్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

 ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు తరగతి గదిలో కనీస అభ్యసన సామర్ధ్యాలను సాధించని పిల్లలకు  ప్రత్యేక తరగతులు నిర్వహించి వారిలోని సామర్థ్యాలను అభివృద్ధి పదములో తీసుకురావడం ఈ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం.

 ఒకే ప్రాంగణంలో ఒక పక్క పూర్వ ప్రాథమిక విద్య మరొక పక్క ప్రాథమిక విద్య అనుసంధానం చేసి విద్యార్థులకు తరగతి గదిలో కావలసిన కనీస అభ్యసనా సామర్థ్యాలు సాధించటం ఈ పాఠశాల యొక్క ప్రత్యేకత అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 గ్రామ నడిబడ్డనున్నప్పటికీ పచ్చని వాతావరణంలో చక్కటి విద్యకు శ్రీకారం చుట్టిన పాఠశాల ఉపాధ్యాయులు అందరికీ పేరుపేరునా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

 ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాపారావు పూర్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శిరీష్య సేవలను వారు కొనియాడారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు యోగ, ఆటల పోటీలలో అవగాహన కలిగించటం నైపుణ్యాలను పెంచడం దిన చర్యలో భాగంగా నిర్ణయించటం ఈ పాఠశాల ప్రత్యేకత.

 ఈ కార్యక్రమంలో వీరి వెంట క్లస్టర్ రిసోర్స్ పర్సన్ గోపికృష్ణ తోపాటు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు,స్వచ్ఛ మిత్రా సేవకులు,మధ్యాహ్న భోజన నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.

భద్రాచలం నాయి బ్రాహ్మణ సంఘం నూతన కమిటీకి బీజేపీ ఓబీసీ మోర్చా ఘన సన్మానం

బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో భద్రాచలం నియోజకవర్గం నాయి బ్రాహ్మణ సంఘం నూతన కమిటీ సభ్యులకు రిటైర్డ్ ఎంప్లాయీస్ భవన్‌లో ఘన సన్మానం నిర్వహించారు. బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు దేవరపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఐలయ్య, పీసీ కేశవ్, జిల్లా కోశాధికారి గుమ్మల వెంకటేశ్వర్లు (జీవా) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు జతంగి కృష్ణ మాట్లాడుతూ, ఓబీసీల అభ్యున్నతికి బీజేపీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. 

నాయి బ్రాహ్మణులు ప్రతి కుటుంబంలో శుభకార్యాల నుంచి సామాజిక అవసరాల వరకు, సమాజానికి తరతరాలుగా అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని, వారి వృత్తికి గౌరవం, గుర్తింపుతో పాటు సంక్షేమం కోసం బీజేపీ ఓబీసీ మోర్చా అండగా నిలుస్తుందని తెలిపారు. నూతన కమిటీ ఐక్యత, సంక్షేమం కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు.

సన్మానం పొందిన వారిలో: నాయి బ్రాహ్మణ సంఘం భద్రాచలం నియోజకవర్గ కన్వీనర్ జంపాల ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షులు కొంగర శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి సోమనపల్లి నాగేశ్వరరావు, జిల్లా యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెలకంటి రఘునాథబాబు, జిల్లా సహకార సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లాజి కుమారస్వామి, సంఘం సభ్యులు మార్కాపురం సీతారాములు, అడ్డగూడూరు సత్యనారాయణ, ఎ. రవికుమార్, మల్యాల శ్రీనివాస్, కొండ్రు వెంకటేశ్వర్లు, ఎ. శ్రీకాంత్ ఉన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుంజా ధర్మా, కుంజా సంతోష్, ముత్యాల శ్రీనివాస్, ములిశెట్టి రాంమోహన్ రావు, చెల్లుబోయిన వెంకన్న, బోడ సత్యనారాయణ, అల్లాడి వెంకట సుబ్బారావు, రామాచారి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేయాలి

సబ్ కలెక్టర్కు వినతి పత్రం ఉమ్మడి జేఏసీతో కలిసి వినతి పత్రం అందచేసిన  T.S.G.R.EA.యూనిట్ సభ్యులు 

 ది. 01.09.2026 తెలంగాణ రాష్ట్ర పెన్షనర్లు మరియు ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపుమేరకు సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినంగా  ప్రకటించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. 

 ఈ సందర్భంగా TSGREA భద్రాచలం యూనిట్ అధ్యక్షులు జి.భూషణ రావు ,కార్యదర్శి కె మధుసూదన్ రావు  మాట్లాడుతూ రెండవ పి ఆర్ సి ని అమలు చేయాలని పెండింగ్లో ఉన్న ఆరు డిఏ బకాయిని విడుదల చేయాలని ఓపిఎస్ ని కొనసాగించాలని సిపిఎస్ ని రద్దు చేయాలని ఆర్డిఏ, పెండింగ్ లో ఉన్న అన్ని బకాయిలు విడుదల చేయాలని పెన్షనర్ల హెల్త్ కార్డుకు సంబంధించి మార్గదర్శకాలు పక్కాగా రూపొందించి వారికి కార్డు అందించాలని  పలు డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని ఉమ్మడి JAC తో కలిసి భద్రాచలం సభ కలెక్టర్ వారికి వినతిపత్రం సమర్పించడం జరిగినది.

 ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వై. రామచంద్రరావు  అసోసియేట్ ప్రెసిడెంట్ జి.వెంకన్న, జి వి సత్యనారాయణ,ఎస్ హనుమంతరావు సిహెచ్  నరసింహం, ఏ శ్రీనివాసరావు,రఘురాం ప్రసాద్, పాపయ్య,కృష్ణారావు, సూరిబాబు, అప్పారావు బ్రహ్మేశ్వర రావు, ఏసుదాసు ఆదినారాయణ, కే శేఖరు గమనేయులు,వెంకటేశ్వరవు రామలింగం,రోడబాయి,సౌదామని,సారమ్మ, వజ్రమని రోజామని తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

Monday, August 31, 2026

పచ్చని వాతావరణంలో పాఠశాల...



 భద్రాచలం పట్టణంలో రంగనాయకుల గుట్టపై ఉన్న ప్రాథమిక పాఠశాల పచ్చని వాతావరణంలో భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్నారని భద్రాచలం మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాసరావు అన్నారు.

  ఎవరైనా ఒక్కసారి ఈ పాఠశాల ఆవరణకు వచ్చారంటే అద్భుతమైన వాతావరణాన్ని వారు చవిచూడాల్సిందే అని బెక్కంటి అభిప్రాయం వ్యక్తం చేశారు.

 నిత్యం పిల్లలకు అందుబాటులో *అనుభవజ్ఞులైన అంకిత భావం కలిగిన ఉపాధ్యాయులచే కృత్యాధార బోధనోపకరణాల వినియోగము, విద్యార్థి కేంద్రం బోధనతో పాటు వసతులు ఎవరు ఊహించని విధంగా ఉన్నాయని కాబట్టి ఈ పాఠశాలలో చదవటం పిల్లలకు ఒక అదృష్టమని* దానిని అర్థం చేసుకొని ఈ ప్రాంత తల్లిదండ్రులందరూ ఒక్కసారి ఈ పాఠశాలల సందర్శించి మీ పిల్లల్ని అందరిని ఈ పాఠశాలలో నమోదు చేయవలసిందిగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
 ఈ సందర్భంగా మండల *విద్యాశాఖ అధికారి విద్యార్థిలతో ముఖాముఖి నిర్వహించి* అనంతరం విద్యార్థుల్లోని అంతర్గత సామర్ధ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచారు.
 
నేపథ్యంలో పాఠశాలలో ఎఫ్ ఎల్ ఎన్ మరింత ప్రతిష్టంగా అమలు చేసి గుణాత్మకమైన విద్యాసాధనకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
 అదేవిధంగా విద్యార్థులకు *గ్రంథాలయ నిర్వహణ, ఆటలు అందుబాటులో ఉండే విధంగా కృషి* చేయాలని ఉపాధ్యాయులను కోరారు. 
 ఇది ఇలా ఉండగా పచ్చని పాఠశాల వాతావరణంలో చక్కని *కిచెన్ గార్డెన్ నిర్వహణ నిర్వహణ* పట్ల మండల విద్యాశాఖ అధికారి సంతృప్తి వ్యక్తపరిచారు.
 ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి తో పాటు *సిఆర్పి గోపికృష్ణ ఉపాధ్యాయులు కృష్ణ, విజయ్, స్వచ్ఛ మిత్ర సేవకులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు* తదితరులు పాల్గొన్నారు.

Saturday, August 29, 2026

నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిజేయాలి


 కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల దగా పాలనపై కెటిఆర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 2 నుండి 8 వరకు బిఆర్ యస్ పార్టీ నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు కో కన్వీనర్ ఐనవోలు పవన్ ఒక ప్రకటనలో తెలిపారు. 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 6 గ్యారంటీలు 420 హమీలు అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో హమీలు నెరవేర్చుతాముఅని చెప్పిన ప్రభుత్వం 1,000 రోజులు అయినా ఒక్క హమీ కూడా పూర్తిగా అమలు చేయలేదు. అంతే కాకుండా కెసిఆర్ బీద ప్రజలకు కొరకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కళ్యాణ్ లక్ష్మి షాదిముబారాక్ కెసిఆర్ కిట్టు రైతు భీమా పధకాలను నిలిపివేయడం వాటిని వెంటనే అమలు చేయాలని ఇచ్చిన హమీలు అమలు చేయాలని ప్రతీ సంవత్సరం రైతు భరోసా కౌలు రైతులకు 15 వేలు ఆసరా పెన్షన్లు 4 వేలు వికలాంగులకు 6 వేలు 500 లకే గ్యాస్ తులం బంగారం ప్రతీ మహిళకు 2500 రూ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ జాబ్ క్యాలెండర్ యూత్ డిక్లరేషన్ నిరుద్యోగ బృతివిద్యార్థినులకు స్కూటీలు విద్యార్థులకు ఫ్రీ ఇంటర్ నెట్  పోటి పరీక్షలకు  ఫీజులు రద్దు ప్రతీ ఆటోడ్రైవలకు 12 వేలు వ్యవసాయ కూలీలకు 12 వేలు ఉద్యమకారులకు250 చదరపు గజాల ఇంటి స్థలాలు జర్నలిస్టులకు 1,00 కోట్లుతో సంక్షేమ నిధి అనేక హామీలు ఇచ్చి అమలు చేయని ఈ ప్రభుత్వం పై బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు సర్పంచులు వార్డు మెంబర్లలు కెసిఆర్ అభిమానులు ఈ 7 రోజులు ప్రతీ రోజు నిరసనలు ధర్నాలు గ్యారంటీ కార్డులు పంపిణీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం దగాకోరు పరిపాలన గురించి అవినీతి గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి 10 వ తేదీన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిజేయాలని  తెలిపారు

Tuesday, August 25, 2026

ఆదివారం ఉదయం శ్రీకాకుళంలో ...

  (23-8-26) ఆదివారం ఉదయం శ్రీకాకుళంలో అట్టాడ అపల్నాయుడు గారి 74వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని వారి బంధుమిత్రుల సమక్షంలో వారి స్వగృహంలో చిన్నపాటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 

ఆ కార్యక్రమానంతరం అందరం కలిసి పట్టణంలోని యు.టి. యఫ్. భవన్ లో పలువురు సాహితీవేత్తలు, సాహిత్యాభిమానుల సమక్షంలో వారి ఇటీవలి రచన ‘తంపర’ వ్యాస సంపుటి ఆవిష్కరణ జరిగింది. 


తదనంతరం కళింగాంధ్రకే చెందిన మరో సుప్రసిద్ధ కవి, గాయకుడు, కథకుడు, వ్యాసకర్త, విశ్రాంత ఉపాధ్యాయుడు అయిన శ్రీ గంటేడ గౌరునాయుడు పార్వతీపురం గారు నేను కలిసి సంయుక్తంగా వెలువరించిన ‘అనేక ఉదయాలు - రెండు హృదయాలు’ అనే సరికొత్త రచనా సంవిధాన ‘వారధి’ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. 

 ఈ “అనేక ఉదయాలు - రెండు హృదయాలు” వెలువరింతలో విశేష కృషిచేసిన చిరంజీవులు గంటేడ క్రాంతి మరియు ఉపాధ్యాయుడు, కేంద్రసాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత అయిన బాలసుధాకరమౌళిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు కుంటున్నాము.

సభలో పార్వతీపురం నుండి గౌరునాయుడు గారితో పాటు మల్లిపురం జగదీష్, సిరికి స్వామినాయుడు, చింతా అప్పలనాయుడు, పక్కి రవీంద్రనాథ్ తదితరులు, 

విజయనగరం నుండి సాహితీ స్రవంతి రాష్ట్రభాద్యులు శ్రీచీకటి దివాకర్ గారు వారి శ్రీమతి చంద్రికారాణి గార్లు కూడా వచ్చారు.

విశాఖపట్నం నుండి కవి, గాయకుడు, నటుడు అయిన సాంబమూర్తి, కవి, కథకుడు వెంకట్ గార్లు కూడా వచ్చారు. 

స్థానిక శ్రీకాకుళం వాసులైన అనేక మంది కవులు, కథకులు, విమర్శకులు, సాహితీ వేత్తలు, సాహితీ శ్రేయోభిలాషులు విచ్చేసి మూడు గంటలపాటు కొలువుదీరి సభను దిగ్విజయంచేసి, సాహిత్యం పట్ల వారికున్న మక్కువను వెల్లడించారు. 

విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, కథకులు అయిన శ్రీ దాసరి రామచంద్రరావు గారు సభాధ్యక్షులుగా ఆద్యంతం సమయపాలనను పాటిస్తూ ఎంతో నేర్పుగా సభను విజయవంతంగా నడిపించారు.

సభలో సర్వశ్రీ నల్లి ధర్మారావు, సిరికి స్వామినాయుడు, పక్కి రవీంద్ర, చింతా అప్పలనాయుడు గార్లు ఆత్మీయ భాషణం చేశారు. 

అలాగే సభలో తన గానంతో చింతాడ రామచంద్రరావు, డప్పుతో డప్పు శ్రీను గార్లు ఆహూతులను ఉర్రూతలూగించారు.

ముఖ్య అతిథులుగా కళింగసీమలో సాహిత్య ప్రచురణలు వెలువరిస్తున్న  చిగిలిపల్లి ప్రభాకర్ రావు మాష్టారు, చీకటి దివాకర్ గార్లు పాల్గొన్నారు. 

‘తంపర’ వ్యాస సంపుటిని  సాహితీ స్రవంతి శ్రీనివాస్, 

‘ఎన్నో ఉదయాలు

రెండు హృదయాలు’ పుస్తకాన్ని ప్రముఖ వైద్యులు డాక్టర్ సుధీర్ గార్లు ఆవిష్కరించారు.

బహుకాలం గుర్తుండిపోయే సాహితీ వ్యాసంగంలోను, సాహితీసభలోనూ కూడా నేను భాగస్వామినైనందుకు ఎంతో సంతోషిస్తున్నాను. 

-- శిరంశెట్టి కాంతారావు

Monday, August 24, 2026

విశ్వవిద్యాలయాన్ని మరిపిస్తున్న భద్రాచలం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల

 


 భద్రాచలం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలోని వసతులు గాని విద్యార్థులు క్రమశిక్షణ గాని తరగతులను నిర్వహణ గాని ఉపాధ్యాయుల బోధన గాని కంప్యూటర్, గణితము, సైన్స్ ల్యాబ్  నిర్వహణ  గాని మరుగుదొడ్ల నిర్వహణ గాని  విశ్వవిద్యాలయాన్ని  మైమరిపిస్తుందని మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేశారు.

 సోమవారం నాడు ప్రార్ధన సమయంలో పాల్గొని కొద్దిసేపు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉదయం ప్రార్థన కన్నా ముందే విద్యార్థులు పాఠశాలలకు హాజరై పాఠశాలలోని నిన్న ఉపాధ్యాయలు ఇచ్చిన ఇంటి పనిని పూర్తి చేయటం గమనార్హం. 

ఈ నేపథ్యంలో అన్ని తరగతి గదులు వసతులను స్వయంగా ఆయన పరిశీలించిన అనంతరం ఉపాధ్యాయులతోనూ విద్యార్థులతోనూ మాట్లాడి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేశారు.

 పాఠశాలలో హరితహారం, పరిశుభ్రత పచ్చదనం చూడముచ్చటగా ఉందని స్వయంగా విద్యార్థి కేంద్రంగా తరగతి గది బోధనా తో పాటు కిచెన్ గార్డెన్ నిర్వహణ నిర్వహించడం ప్రధాన ఉపాధ్యాయిని కృషికి నిదర్శనమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

 సుమారు 475 మంది పిల్లలు ఉన్నప్పటికీ నిశ్శబ్ద వాతావరణంలో పాఠశాల ఉండటం ఉదయం పిల్లలు ప్రార్థన కన్నా ముందే వచ్చి వారి వారి తరగతి గదిలో వారి ఇంటి పనిని పూర్తి చేసుకోవటం , క్రమశిక్షణతో ఉండటం,నిశ్శబ్దత పాటించటం   చూపరాలను  సైతం ఆకట్టుకుంటుంది.

 ఇక్కడ పనిచేసే సిబ్బంది ఉపాధ్యాయులు అంకితభావం వారి సమిష్టి కృషికి నిదర్శనమని,ఈ పాఠశాల పనితీరు లో ప్రతి   ఉపాధ్యాయుడు నిరంతర కృషిని ప్రతి ఒక్కరు  ఆదర్శంగా తీసుకోవాలని ,గుర్తించాలని పిలుపునిచ్చారు.