Showing posts with label News. Show all posts
Showing posts with label News. Show all posts

Tuesday, September 1, 2026

వేద పాఠశాలను తలపిస్తున్న తాత గుడి సెంటర్ ప్రాథమిక పాఠశాల..


 భద్రాచలం తాత గుడి సెంటర్లోని ప్రాథమిక పాఠశాల ప్రాంగణములోనే  ఒకవైపు ప్రాథమిక విద్య మరోక వైపు పూర్వ ప్రాథమిక విద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను చూస్తే అలనాడు అంకిత భావంతో  గ్రామాలకు దూరంగా నిర్వహించిన వేద పాఠశాలను తలపిస్తున్నాయని భద్రాచలం మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేశారు.

 పాఠశాలల పర్యవేక్షణలో భాగంగా మంగళవారం నాడు ఆర్కస్మికంగా ఈ పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి సందర్శించారు.  ఈ పాఠశాల  ప్రాథమిక స్థాయిలో 149 మంది విద్యార్థులు పూర్వ ప్రాథమిక కేంద్రంలో 20 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.

 ఈ పాఠశాలలో ప్రతిరోజు ఎక్సెల్ ప్రోగ్రాం కింద విద్యార్థులు కంప్యూటర్లను వినియోగించుకొని ఆధునిక జ్ఞానాన్ని నేర్చుకోవటం వాటిలోని మెలుకువలను అలవర్చుకొని  వినియోగించుకోవడం  అందరికీ ఆదర్శమని  బెక్కంటి అన్నారు.


 ఈ నేపథ్యంలో బ్యాగ్ లెస్ డే రోజు విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలలో పోటీలను నిర్వహించడం ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థుల్లో అంతర్గత సామర్థ్యాన్ని వెలికి తీయటం  ఒక ప్రత్యేకత సంతరించుకుంది.

 ఇదిలా ఉండగా పూర్వ ప్రాథమిక విద్యలో విద్యార్థులను అంతర్గత సామర్థ్యాలను వెలుగుచూస్తూ పక్కనే ఉన్న ప్రాథమిక విద్యను పరిచయం చేస్తున్న తీరు చూస్తే ప్రతి ఒక్కరు తమ పిల్లలను ఈ పాఠశాలకు పంపించటం తద్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

 ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు తరగతి గదిలో కనీస అభ్యసన సామర్ధ్యాలను సాధించని పిల్లలకు  ప్రత్యేక తరగతులు నిర్వహించి వారిలోని సామర్థ్యాలను అభివృద్ధి పదములో తీసుకురావడం ఈ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం.

 ఒకే ప్రాంగణంలో ఒక పక్క పూర్వ ప్రాథమిక విద్య మరొక పక్క ప్రాథమిక విద్య అనుసంధానం చేసి విద్యార్థులకు తరగతి గదిలో కావలసిన కనీస అభ్యసనా సామర్థ్యాలు సాధించటం ఈ పాఠశాల యొక్క ప్రత్యేకత అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 గ్రామ నడిబడ్డనున్నప్పటికీ పచ్చని వాతావరణంలో చక్కటి విద్యకు శ్రీకారం చుట్టిన పాఠశాల ఉపాధ్యాయులు అందరికీ పేరుపేరునా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

 ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాపారావు పూర్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శిరీష్య సేవలను వారు కొనియాడారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు యోగ, ఆటల పోటీలలో అవగాహన కలిగించటం నైపుణ్యాలను పెంచడం దిన చర్యలో భాగంగా నిర్ణయించటం ఈ పాఠశాల ప్రత్యేకత.

 ఈ కార్యక్రమంలో వీరి వెంట క్లస్టర్ రిసోర్స్ పర్సన్ గోపికృష్ణ తోపాటు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు,స్వచ్ఛ మిత్రా సేవకులు,మధ్యాహ్న భోజన నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.

భద్రాచలం నాయి బ్రాహ్మణ సంఘం నూతన కమిటీకి బీజేపీ ఓబీసీ మోర్చా ఘన సన్మానం

బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో భద్రాచలం నియోజకవర్గం నాయి బ్రాహ్మణ సంఘం నూతన కమిటీ సభ్యులకు రిటైర్డ్ ఎంప్లాయీస్ భవన్‌లో ఘన సన్మానం నిర్వహించారు. బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు దేవరపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఐలయ్య, పీసీ కేశవ్, జిల్లా కోశాధికారి గుమ్మల వెంకటేశ్వర్లు (జీవా) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు జతంగి కృష్ణ మాట్లాడుతూ, ఓబీసీల అభ్యున్నతికి బీజేపీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. 

నాయి బ్రాహ్మణులు ప్రతి కుటుంబంలో శుభకార్యాల నుంచి సామాజిక అవసరాల వరకు, సమాజానికి తరతరాలుగా అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని, వారి వృత్తికి గౌరవం, గుర్తింపుతో పాటు సంక్షేమం కోసం బీజేపీ ఓబీసీ మోర్చా అండగా నిలుస్తుందని తెలిపారు. నూతన కమిటీ ఐక్యత, సంక్షేమం కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు.

సన్మానం పొందిన వారిలో: నాయి బ్రాహ్మణ సంఘం భద్రాచలం నియోజకవర్గ కన్వీనర్ జంపాల ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షులు కొంగర శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి సోమనపల్లి నాగేశ్వరరావు, జిల్లా యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెలకంటి రఘునాథబాబు, జిల్లా సహకార సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లాజి కుమారస్వామి, సంఘం సభ్యులు మార్కాపురం సీతారాములు, అడ్డగూడూరు సత్యనారాయణ, ఎ. రవికుమార్, మల్యాల శ్రీనివాస్, కొండ్రు వెంకటేశ్వర్లు, ఎ. శ్రీకాంత్ ఉన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుంజా ధర్మా, కుంజా సంతోష్, ముత్యాల శ్రీనివాస్, ములిశెట్టి రాంమోహన్ రావు, చెల్లుబోయిన వెంకన్న, బోడ సత్యనారాయణ, అల్లాడి వెంకట సుబ్బారావు, రామాచారి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేయాలి

సబ్ కలెక్టర్కు వినతి పత్రం ఉమ్మడి జేఏసీతో కలిసి వినతి పత్రం అందచేసిన  T.S.G.R.EA.యూనిట్ సభ్యులు 

 ది. 01.09.2026 తెలంగాణ రాష్ట్ర పెన్షనర్లు మరియు ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపుమేరకు సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినంగా  ప్రకటించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. 

 ఈ సందర్భంగా TSGREA భద్రాచలం యూనిట్ అధ్యక్షులు జి.భూషణ రావు ,కార్యదర్శి కె మధుసూదన్ రావు  మాట్లాడుతూ రెండవ పి ఆర్ సి ని అమలు చేయాలని పెండింగ్లో ఉన్న ఆరు డిఏ బకాయిని విడుదల చేయాలని ఓపిఎస్ ని కొనసాగించాలని సిపిఎస్ ని రద్దు చేయాలని ఆర్డిఏ, పెండింగ్ లో ఉన్న అన్ని బకాయిలు విడుదల చేయాలని పెన్షనర్ల హెల్త్ కార్డుకు సంబంధించి మార్గదర్శకాలు పక్కాగా రూపొందించి వారికి కార్డు అందించాలని  పలు డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని ఉమ్మడి JAC తో కలిసి భద్రాచలం సభ కలెక్టర్ వారికి వినతిపత్రం సమర్పించడం జరిగినది.

 ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వై. రామచంద్రరావు  అసోసియేట్ ప్రెసిడెంట్ జి.వెంకన్న, జి వి సత్యనారాయణ,ఎస్ హనుమంతరావు సిహెచ్  నరసింహం, ఏ శ్రీనివాసరావు,రఘురాం ప్రసాద్, పాపయ్య,కృష్ణారావు, సూరిబాబు, అప్పారావు బ్రహ్మేశ్వర రావు, ఏసుదాసు ఆదినారాయణ, కే శేఖరు గమనేయులు,వెంకటేశ్వరవు రామలింగం,రోడబాయి,సౌదామని,సారమ్మ, వజ్రమని రోజామని తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

Monday, August 31, 2026

పచ్చని వాతావరణంలో పాఠశాల...



 భద్రాచలం పట్టణంలో రంగనాయకుల గుట్టపై ఉన్న ప్రాథమిక పాఠశాల పచ్చని వాతావరణంలో భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్నారని భద్రాచలం మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాసరావు అన్నారు.

  ఎవరైనా ఒక్కసారి ఈ పాఠశాల ఆవరణకు వచ్చారంటే అద్భుతమైన వాతావరణాన్ని వారు చవిచూడాల్సిందే అని బెక్కంటి అభిప్రాయం వ్యక్తం చేశారు.

 నిత్యం పిల్లలకు అందుబాటులో *అనుభవజ్ఞులైన అంకిత భావం కలిగిన ఉపాధ్యాయులచే కృత్యాధార బోధనోపకరణాల వినియోగము, విద్యార్థి కేంద్రం బోధనతో పాటు వసతులు ఎవరు ఊహించని విధంగా ఉన్నాయని కాబట్టి ఈ పాఠశాలలో చదవటం పిల్లలకు ఒక అదృష్టమని* దానిని అర్థం చేసుకొని ఈ ప్రాంత తల్లిదండ్రులందరూ ఒక్కసారి ఈ పాఠశాలల సందర్శించి మీ పిల్లల్ని అందరిని ఈ పాఠశాలలో నమోదు చేయవలసిందిగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
 ఈ సందర్భంగా మండల *విద్యాశాఖ అధికారి విద్యార్థిలతో ముఖాముఖి నిర్వహించి* అనంతరం విద్యార్థుల్లోని అంతర్గత సామర్ధ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచారు.
 
నేపథ్యంలో పాఠశాలలో ఎఫ్ ఎల్ ఎన్ మరింత ప్రతిష్టంగా అమలు చేసి గుణాత్మకమైన విద్యాసాధనకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
 అదేవిధంగా విద్యార్థులకు *గ్రంథాలయ నిర్వహణ, ఆటలు అందుబాటులో ఉండే విధంగా కృషి* చేయాలని ఉపాధ్యాయులను కోరారు. 
 ఇది ఇలా ఉండగా పచ్చని పాఠశాల వాతావరణంలో చక్కని *కిచెన్ గార్డెన్ నిర్వహణ నిర్వహణ* పట్ల మండల విద్యాశాఖ అధికారి సంతృప్తి వ్యక్తపరిచారు.
 ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి తో పాటు *సిఆర్పి గోపికృష్ణ ఉపాధ్యాయులు కృష్ణ, విజయ్, స్వచ్ఛ మిత్ర సేవకులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు* తదితరులు పాల్గొన్నారు.

Saturday, August 29, 2026

నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిజేయాలి


 కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల దగా పాలనపై కెటిఆర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 2 నుండి 8 వరకు బిఆర్ యస్ పార్టీ నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు కో కన్వీనర్ ఐనవోలు పవన్ ఒక ప్రకటనలో తెలిపారు. 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 6 గ్యారంటీలు 420 హమీలు అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో హమీలు నెరవేర్చుతాముఅని చెప్పిన ప్రభుత్వం 1,000 రోజులు అయినా ఒక్క హమీ కూడా పూర్తిగా అమలు చేయలేదు. అంతే కాకుండా కెసిఆర్ బీద ప్రజలకు కొరకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కళ్యాణ్ లక్ష్మి షాదిముబారాక్ కెసిఆర్ కిట్టు రైతు భీమా పధకాలను నిలిపివేయడం వాటిని వెంటనే అమలు చేయాలని ఇచ్చిన హమీలు అమలు చేయాలని ప్రతీ సంవత్సరం రైతు భరోసా కౌలు రైతులకు 15 వేలు ఆసరా పెన్షన్లు 4 వేలు వికలాంగులకు 6 వేలు 500 లకే గ్యాస్ తులం బంగారం ప్రతీ మహిళకు 2500 రూ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ జాబ్ క్యాలెండర్ యూత్ డిక్లరేషన్ నిరుద్యోగ బృతివిద్యార్థినులకు స్కూటీలు విద్యార్థులకు ఫ్రీ ఇంటర్ నెట్  పోటి పరీక్షలకు  ఫీజులు రద్దు ప్రతీ ఆటోడ్రైవలకు 12 వేలు వ్యవసాయ కూలీలకు 12 వేలు ఉద్యమకారులకు250 చదరపు గజాల ఇంటి స్థలాలు జర్నలిస్టులకు 1,00 కోట్లుతో సంక్షేమ నిధి అనేక హామీలు ఇచ్చి అమలు చేయని ఈ ప్రభుత్వం పై బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు సర్పంచులు వార్డు మెంబర్లలు కెసిఆర్ అభిమానులు ఈ 7 రోజులు ప్రతీ రోజు నిరసనలు ధర్నాలు గ్యారంటీ కార్డులు పంపిణీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం దగాకోరు పరిపాలన గురించి అవినీతి గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి 10 వ తేదీన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిజేయాలని  తెలిపారు

Tuesday, August 25, 2026

ఆదివారం ఉదయం శ్రీకాకుళంలో ...

  (23-8-26) ఆదివారం ఉదయం శ్రీకాకుళంలో అట్టాడ అపల్నాయుడు గారి 74వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని వారి బంధుమిత్రుల సమక్షంలో వారి స్వగృహంలో చిన్నపాటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 

ఆ కార్యక్రమానంతరం అందరం కలిసి పట్టణంలోని యు.టి. యఫ్. భవన్ లో పలువురు సాహితీవేత్తలు, సాహిత్యాభిమానుల సమక్షంలో వారి ఇటీవలి రచన ‘తంపర’ వ్యాస సంపుటి ఆవిష్కరణ జరిగింది. 


తదనంతరం కళింగాంధ్రకే చెందిన మరో సుప్రసిద్ధ కవి, గాయకుడు, కథకుడు, వ్యాసకర్త, విశ్రాంత ఉపాధ్యాయుడు అయిన శ్రీ గంటేడ గౌరునాయుడు పార్వతీపురం గారు నేను కలిసి సంయుక్తంగా వెలువరించిన ‘అనేక ఉదయాలు - రెండు హృదయాలు’ అనే సరికొత్త రచనా సంవిధాన ‘వారధి’ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. 

 ఈ “అనేక ఉదయాలు - రెండు హృదయాలు” వెలువరింతలో విశేష కృషిచేసిన చిరంజీవులు గంటేడ క్రాంతి మరియు ఉపాధ్యాయుడు, కేంద్రసాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత అయిన బాలసుధాకరమౌళిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు కుంటున్నాము.

సభలో పార్వతీపురం నుండి గౌరునాయుడు గారితో పాటు మల్లిపురం జగదీష్, సిరికి స్వామినాయుడు, చింతా అప్పలనాయుడు, పక్కి రవీంద్రనాథ్ తదితరులు, 

విజయనగరం నుండి సాహితీ స్రవంతి రాష్ట్రభాద్యులు శ్రీచీకటి దివాకర్ గారు వారి శ్రీమతి చంద్రికారాణి గార్లు కూడా వచ్చారు.

విశాఖపట్నం నుండి కవి, గాయకుడు, నటుడు అయిన సాంబమూర్తి, కవి, కథకుడు వెంకట్ గార్లు కూడా వచ్చారు. 

స్థానిక శ్రీకాకుళం వాసులైన అనేక మంది కవులు, కథకులు, విమర్శకులు, సాహితీ వేత్తలు, సాహితీ శ్రేయోభిలాషులు విచ్చేసి మూడు గంటలపాటు కొలువుదీరి సభను దిగ్విజయంచేసి, సాహిత్యం పట్ల వారికున్న మక్కువను వెల్లడించారు. 

విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, కథకులు అయిన శ్రీ దాసరి రామచంద్రరావు గారు సభాధ్యక్షులుగా ఆద్యంతం సమయపాలనను పాటిస్తూ ఎంతో నేర్పుగా సభను విజయవంతంగా నడిపించారు.

సభలో సర్వశ్రీ నల్లి ధర్మారావు, సిరికి స్వామినాయుడు, పక్కి రవీంద్ర, చింతా అప్పలనాయుడు గార్లు ఆత్మీయ భాషణం చేశారు. 

అలాగే సభలో తన గానంతో చింతాడ రామచంద్రరావు, డప్పుతో డప్పు శ్రీను గార్లు ఆహూతులను ఉర్రూతలూగించారు.

ముఖ్య అతిథులుగా కళింగసీమలో సాహిత్య ప్రచురణలు వెలువరిస్తున్న  చిగిలిపల్లి ప్రభాకర్ రావు మాష్టారు, చీకటి దివాకర్ గార్లు పాల్గొన్నారు. 

‘తంపర’ వ్యాస సంపుటిని  సాహితీ స్రవంతి శ్రీనివాస్, 

‘ఎన్నో ఉదయాలు

రెండు హృదయాలు’ పుస్తకాన్ని ప్రముఖ వైద్యులు డాక్టర్ సుధీర్ గార్లు ఆవిష్కరించారు.

బహుకాలం గుర్తుండిపోయే సాహితీ వ్యాసంగంలోను, సాహితీసభలోనూ కూడా నేను భాగస్వామినైనందుకు ఎంతో సంతోషిస్తున్నాను. 

-- శిరంశెట్టి కాంతారావు

Monday, August 24, 2026

విశ్వవిద్యాలయాన్ని మరిపిస్తున్న భద్రాచలం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల

 


 భద్రాచలం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలోని వసతులు గాని విద్యార్థులు క్రమశిక్షణ గాని తరగతులను నిర్వహణ గాని ఉపాధ్యాయుల బోధన గాని కంప్యూటర్, గణితము, సైన్స్ ల్యాబ్  నిర్వహణ  గాని మరుగుదొడ్ల నిర్వహణ గాని  విశ్వవిద్యాలయాన్ని  మైమరిపిస్తుందని మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేశారు.

 సోమవారం నాడు ప్రార్ధన సమయంలో పాల్గొని కొద్దిసేపు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉదయం ప్రార్థన కన్నా ముందే విద్యార్థులు పాఠశాలలకు హాజరై పాఠశాలలోని నిన్న ఉపాధ్యాయలు ఇచ్చిన ఇంటి పనిని పూర్తి చేయటం గమనార్హం. 

ఈ నేపథ్యంలో అన్ని తరగతి గదులు వసతులను స్వయంగా ఆయన పరిశీలించిన అనంతరం ఉపాధ్యాయులతోనూ విద్యార్థులతోనూ మాట్లాడి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేశారు.

 పాఠశాలలో హరితహారం, పరిశుభ్రత పచ్చదనం చూడముచ్చటగా ఉందని స్వయంగా విద్యార్థి కేంద్రంగా తరగతి గది బోధనా తో పాటు కిచెన్ గార్డెన్ నిర్వహణ నిర్వహించడం ప్రధాన ఉపాధ్యాయిని కృషికి నిదర్శనమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

 సుమారు 475 మంది పిల్లలు ఉన్నప్పటికీ నిశ్శబ్ద వాతావరణంలో పాఠశాల ఉండటం ఉదయం పిల్లలు ప్రార్థన కన్నా ముందే వచ్చి వారి వారి తరగతి గదిలో వారి ఇంటి పనిని పూర్తి చేసుకోవటం , క్రమశిక్షణతో ఉండటం,నిశ్శబ్దత పాటించటం   చూపరాలను  సైతం ఆకట్టుకుంటుంది.

 ఇక్కడ పనిచేసే సిబ్బంది ఉపాధ్యాయులు అంకితభావం వారి సమిష్టి కృషికి నిదర్శనమని,ఈ పాఠశాల పనితీరు లో ప్రతి   ఉపాధ్యాయుడు నిరంతర కృషిని ప్రతి ఒక్కరు  ఆదర్శంగా తీసుకోవాలని ,గుర్తించాలని పిలుపునిచ్చారు.

Tuesday, August 18, 2026

ఎఫ్ ఎల్ ఎన్ తో శ్వాస పీల్చాలి.. ఎఫ్ ఎల్ ఎన్ తో శ్వాస వదలాలి

 ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయులందరూ బోధనలో విద్యార్థి కేంద్రంగా చేసుకొని ఎఫ్.ఎల్.ఎన్ తో శ్వాస వీల్చు పీల్చుకొని ఎఫ్. ఎల్.ఏం తో శ్వాస విడిచే అంత ప్రాముఖ్యత  తో  ప్రాథమిక విద్యా బోధన ఉండాలని మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి  శ్రీనివాసరావు ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. 

 మంగళవారం నాడు భద్రాచలం మండల రిసోర్స్ కేంద్రం లో మండల విద్యాశాఖ అధికారి అధ్యక్షతన  ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక, కేజీబీవీ, ఎయిడెడ్ ప్రధానోపాధ్యాయుల సమావేశం జరిగింది.

 ఈ సమావేశంలో మండల విద్యాశాఖ అధికారి పాఠశాల స్థాయిలో గుణాత్మకమైన విద్య సాధించడానికి తరగతి గదిలో అభ్యసనా సామర్థ్యాలను విద్యార్థి కేంద్రంగా చేసుకొని ఎలా సాధించాలో సుమారు రెండు గంటల పాటు ప్రధానోపాధ్యాయులు అందరికీ శిక్షణ నిర్వహించారు. 

 బుధవారం మరియు గురువారం నాడు మండలం లోని కాంప్లెక్స్ స్థాయిలో నిర్వహించే కాంప్లెక్స్ సమావేశాలలో తీసుకోవాల్సిన, పాటించాల్సిన,బోధించాల్సిన పలు అంశాలపై కాంప్లెక్స్ హెడ్మాస్టర్లకు సూచనలు చేశారు.

 ఈ నేపథ్యంలో ఈ ఏడాది మండల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో నమోదు అత్యధికంగా సాధించిన జాన్సన్( గవర్నమెంట్ హై స్కూల్ ), T.రమా( జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల ), రాజా శ్రీనివాస్( మండల ప్రాథమికోన్నత పాఠశాల జగదీష్ కాలనీ), పాపయ్య ( ప్రాథమిక పాఠశాల తాత గుడి సెంటర్ ) ప్రధానోపాధ్యాయులకు ఘన సన్మానాన్ని నిర్వహించారు. 

 ఈ కార్యక్రమంలో సి ఆర్ పి లు గోపి, ఆర్ కె, సిసి బేబీ, ఐ ఈ ఆర్ పి S. పద్మ మరియు ఏ పి ఎం  తదితరులు పాల్గొన్నారు.

Saturday, August 15, 2026

రచయిత మూర్తి ని ఘనంగా సన్మానించిన వృక్షమిత్ర డా.గోళ్ళ భూపతి రావు

అనేక ప్రక్రియల్లో రచనలు చేసి ప్రముఖ రచయిత గా పేరుపొందిన కెవివిఎస్ మూర్తి తన ఇటీవల అనువాద పుస్తకం మిష్మీకొండలు గొప్ప విజయం పొందిన సందర్భం లో వృక్షమిత్ర అవార్డ్ గ్రహీత, ప్రముఖ సంఘ సేవకులు డా. గోళ్ళ భూపతి రావు దుశ్శాలువతో ఘనంగా సన్మానించారు. తెలంగాణా రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనం లో ఈ కార్యక్రమం జరిగింది. గతం లో మూర్తి అనువదించిన గాడ్ ఫాదర్ అనే గ్రంథం తెలుగు లో వెలువడి దేశవిదేశాల్లోని తెలుగు పాఠకుల్ని సైతం విశేషం గా అలరించిందని, ప్రస్తుతం తెలుగు లోకి అనువదించిన మిష్మీ కొండలు పుస్తకం ఈశాన్య భారత దేశం లో జరిగిన స్వాతంత్ర పోరాటాన్ని చిత్రించినదని తెలిపారు. డా.గోళ్ళ భూపతి రావు ఇంకా పుస్తక విశిష్టత ని వివరిస్తూ దీని ఆంగ్లం ఓ రాసిన  మూల రచయిత్రి మమాంగ్ డాయ్ ఒక విశ్రాంత ఐ.ఏ.ఎస్. అధికారిణి అని చెబుతూ,ఇప్పటికే ప్రముఖ దిన పత్రికల్లో చక్కని రివ్యూలు వచ్చాయని అభినందించారు.

విశ్రాంత ఉద్యోగుల కార్యాలయం లో పంద్రాగస్ట్ వేడుకలు

ఎన్నో త్యాగాలతో తెచ్చుకున్న స్వాతంత్ర్య ఫలాల్ని అందరికీ అందేలా ప్రతి పౌరుడు తన విధిని చిత్తశుద్ధి తో నిర్వర్తించాలని,చారిత్రక ఘటనల్ని వివరిస్తూ దేశభక్తుల జీవితాల్ని సోదాహరణం గా వివరిస్తూ నాటి వారి త్యాగాల్ని మరిచిపోరాదని తెలంగాణా రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ డివిజన్ అధ్యక్షులు జి.భూషణం పిలుపునిచ్చారు. పంద్రాగస్టు ని పురస్కరించుకుని కార్యాలయ ప్రాంగణం లో జాతీయపతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. విశ్రాంత ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఫాల్గొన్నారు. ప్రధాన కార్యదార్శి కె.మధుసూదన్ రావు,అసోసియేట్ అధ్యక్షులు జి.వెంకన్న,మీడియా కార్యదర్శి గాదె తులసీ దాస్ ఇంకా ఇతరులు మాట్లాడారు. 



ఉత్తమ ఉద్యోగి’ అవార్డు అందుకున్న బొల్లి వెంకటరాజు

భద్రాచలం, ఆగస్ట్ 15: నిరంతరం ప్రజా సేవలో నిమగ్నమై, విధి నిర్వహణలో నిబద్ధత, అంకితభావం కనబరిచే ఉద్యోగుల కష్టానికి ఎల్లప్పుడూ తగిన గుర్తింపు లభిస్తుందని మరోసారి నిరూపితమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో తనదైన పనితీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న  బొల్లి వెంకటరాజు జిల్లా స్థాయి "ఉత్తమ ఉద్యోగి" పురస్కారాన్ని అందుకున్నారు..

​ఘనంగా పురస్కార ప్రదానోత్సవం!

వరంగల్ ​జిల్లా కేంద్రంలో నిర్వహించిన అధికారిక వేడుకల్లో భాగంగా,NPDCL ( సిఎండి )   కర్నాటి వరుణ్ రెడ్డి (IAS)  చేతుల మీదుగా, బొల్లి వెంకటరాజు ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.

​ఈ సందర్భంగా( సి ఎం డి ) మాట్లాడుతూ:సమాజ అభివృద్ధిలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమైనది. తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ, ప్రజలకు సేవలందించే ఇలాంటి ప్రతిభావంతులైన ఉద్యోగులు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు.కష్టపడి పనిచేసే తత్వానికి దక్కిన గౌరవం.​ బొల్లి వెంకటరాజు  తన విధుల్లో చూపిన క్రమశిక్షణ, ప్రజల పట్ల ఉన్న సేవాభావం మరియు క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి చూపిన చొరవకు ఈ అవార్డు నిదర్శనంగా నిలిచింది. ఎలాంటి ఒత్తిడులు ఎదురైనా చిరునవ్వుతో బాధ్యతలు నిర్వర్తించడం ఆయన పనితీరులోని ప్రత్యేకత అని తోటి ఉద్యోగులు కొనియాడారు.

​వెల్లువెత్తిన అభినందనలు!

​బొల్లి వెంకటరాజు ( సీఎం డి ) చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకోవడం పట్ల:తోటి ఉద్యోగులు, సిబ్బంది.ఉన్నతాధికారులు ​కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు.హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ అవార్డు ఆయన అంకితభావానికి, నిరంతర శ్రమకు దక్కిన ప్రతిఫలమని, భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, సమాజానికి మరింతగా సేవలందించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.



Friday, August 14, 2026

​సెప్టెంబరు 9 లోగా కౌంటర్ దాఖలు చేసి స్టే ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలి


కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత విధానాలు, నిర్లక్ష్య వైఖరి వల్లే పేదింటి ఆడపిల్లలకు ఆసరాగా నిలిచే ‘కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్’ పథకాలపై హైకోర్టు స్టే విధించే పరిస్థితి వచ్చిందని  బి ఆర్ ఎస్ పార్టీ చర్ల మండల కన్వీనర్ దొడ్డి తాతారావు అన్నారు. 

పేద వర్గాలకు ఈ పథకాల ఫలాలు అందకూడదనే దుర్బుద్ధితో, బడ్జెట్ నిధులను ఎగ్గొట్టాలనే కుట్రతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలని కోర్టు వ్యవహారాల్లో అలసత్వం వహిస్తోందని దొడ్డి తాతారావు ఆరోపించారు హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై స్పందిస్తూ, విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేస్తామని స్వయంగా అడ్వొకేట్ జనరల్ తెలిపినప్పటికీ... న్యాయస్థానం పలుమార్లు అవకాశమిచ్చినా ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ సమర్పించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ తీవ్ర బాధ్యతారాహిత్యానికి ప్రత్యక్ష నిదర్శనమని మండిపడ్డారు.

​గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఆర్థిక సాయంతో పాటు అదనంగా "తులం బంగారం" ఇస్తామని రంగుల హామీలు ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక ఆ తులం బంగారం ఇవ్వకపోగా కేసీఆర్ గారి హయాంలో ప్రజాదరణ పొందిన ఈ మహత్తర పథకాలను పూర్తిగా రూపుమాపేందుకు నాటకాలకు తెరలేపిందని అన్నారు 

2014 నుంచి బీఆర్‌ఎస్‌ పాలనలో కేసీఆర్ నాయకత్వంలో పేద కుటుంబాలలోని యువతుల వివాహ ఖర్చుల భారాన్ని తగ్గించి, ఆర్థికంగా ఆదుకోవడానికి 'కల్యాణ లక్ష్మి', 'షాదీ ముబారక్' పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. 

నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన లక్షలాది మంది ఆడబిడ్డల పెళ్లిళ్లకు కొండంత అండగా నిలుస్తూ, ప్రతి ఏటా సగటున రూ. 1,400 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించి వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించామని అన్నారు 

​ప్రభుత్వం ఇప్పటికైనా నిద్రమత్తు వీడి, తదుపరి విచారణ గడువైన సెప్టెంబరు 9 లోగా ఉన్నత న్యాయస్థానంలో బలమైన కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలి.

​అవసరమైతే చట్టసభల ద్వారా ఈ పథకాలకు ప్రత్యేక చట్టబద్ధత కల్పించి, కోర్టు స్టే ఎత్తివేసేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి ​పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారులందరికీ వెంటనే ఆర్థిక సాయం నిధులను విడుదల చేయాలిఅన్నారు.



Thursday, August 13, 2026

పూర్వ వైభవం దిశగా డాక్టర్ పాలరాజు ఇంజనీరింగ్ కాలేజీ


భద్రాచలం,ఆగస్టు 13 : భద్రాచలం పరిసర ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యను అందించాలనే మహోన్నత లక్ష్యంతో స్థాపించబడిన డా.పాల్ రాజ్ ఇంజనీరింగ్ కాలేజీ మరోసారి పూర్వవైభవాన్ని సంతరించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జేఎన్‌టీయూ హైదరాబాద్ అనుబంధంలో తొలి క్రిస్టియన్ మైనారిటీ ఇంజనీరింగ్ విద్యాసంస్థగా పేరొందిన ఈ కళాశాల వేలాది మంది విద్యార్థులను ఉన్నత స్థాయికి తీర్చిదిద్దింది.ఈ కళాశాలలో చదివిన అనేక మంది విద్యార్థులు కార్పొరేట్ కళాశాలల విద్యార్థులకు ఏమాత్రం తీసిపోకుండా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి దేశ, విదేశాల్లో ప్రముఖ సంస్థల్లో ఉన్నత పదవుల్లో స్థిరపడి కళాశాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు.

ప్రస్తుతం జేఎన్‌టీయూ కాకినాడ అనుబంధంలో భద్రాచలం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో కొనసాగుతున్న ఈ కళాశాలలో నూతన యాజమాన్యం బాధ్యతలు స్వీకరించింది. అర్హత కలిగిన ప్రొఫెసర్లు, ఆధునిక ల్యాబొరేటరీలు, బాలురు–బాలికలకు ప్రత్యేక హాస్టళ్లు, మెరుగైన మౌలిక వసతులతో విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు యాజమాన్యం వెల్లడించింది.విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకే మేనేజ్‌మెంట్ సీట్లు అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది అలాగే తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ అనే భేదం లేకుండా దేశంలోని ఏ జిల్లా, ఏ రాష్ట్రానికి చెందిన విద్యార్థులైనా ఈ కళాశాలలో ప్రవేశాలు పొందవచ్చని యాజమాన్యం స్పష్టం చేసింది ప్రస్తుతం బీటెక్ (B.Tech) ఎం.టెక్ *(M.Tech)*డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్నాయని, ఆసక్తి గల విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది. పూర్తి వివరాలకు

📞 98483 69806 సంప్రంచగలరు.

Wednesday, August 12, 2026

ఆదివాసీ యువకుడు చర్ప రాంబాబుకు ఘన సన్మానం

భద్రాచలం,ఆగస్ట్ 12: భద్రాచలంకు చెందిన ఆదివాసీ యువకుడు, డిపో యూత్ సభ్యుడు, మైనారిటీ గురుకుల పాఠశాలలో PETగా పనిచేస్తున్న చర్ప రాంబాబు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో భాగస్వామ్యమై అరుదైన ఘనత సాధించారు.

హైదరాబాద్‌లో 25 ఏప్రిల్ 2026న నిర్వహించిన అతిపెద్ద కరాటే ప్రదర్శనలో మొత్తం 1,212 మంది పాల్గొనగా, విజన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, జె.ఆర్. ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. ఈ కార్యక్రమంలో చర్ప రాంబాబు కూడా పాల్గొని ఈ ప్రతిష్ఠాత్మక రికార్డులో భాగస్వామి అయ్యారు.

ఈ సందర్భంగా డిపో యూత్ ఆధ్వర్యంలో చర్ప రాంబాబును శాలువాతో సత్కరించి, మెమెంటో అందజేసి ఘనంగా అభినందించారు. ఆదివాసీ యువకుడిగా తన ప్రతిభను క్రీడా రంగంలో చాటుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

చర్ప రాంబాబు సాధించిన ఈ విజయం భద్రాచలం ప్రాంత యువతకు, ముఖ్యంగా ఆదివాసీ యువతకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో క్రీడలు మరియు ఇతర రంగాల్లో ముందుకు సాగితే యువత అంతర్జాతీయ స్థాయిలో కూడా తమ ప్రతిభను చాటుకోవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా సంతోష్, టీయుడబ్ల్యూజె భద్రాచలం పట్టణ అధ్యక్షుడు విజ్జగిరి రాజా కిరణ్, డిపో యూత్ సభ్యులు పండా అమృతరావు (అంబు), తాళ్ళ నాగరాజు, శీలం నాగరాజు, తాళ్ళ శివ, కారం రవితేజ, డిపో సత్తి, ప్రసాద్ తదితరులు పాల్గొని చర్ప రాంబాబుకు అభినందనలు తెలిపారు.


Tuesday, August 11, 2026

సమీక్ష సమావేశం

 భద్రాచలం,ఆగస్ట్ 11 : ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలపై ఆదివాసీ సంఘాల ఐక్య వేదిక భద్రాచలం ఆధ్వర్యంలో ట్రైబల్ మ్యూజియంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దినోత్సవ కార్యక్రమాల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన వివిధ కమిటీల సభ్యులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ర్యాలీ, సభ, భోజన సదుపాయాలు, ఇతర ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో చోటుచేసుకున్న చిన్నచిన్న లోపాలను గుర్తించి, వాటిని సవరించుకుంటూ ప్రతి సంవత్సరం ఆదివాసీల ఆత్మగౌరవ దినోత్సవాన్ని మరింత ఘనంగా, విజయవంతంగా నిర్వహించాలని నిర్ణయించారు.

అదేవిధంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన భద్రాచలం ఎమ్మెల్యే శ్రీ తెల్లం వెంకట్రావు, భద్రాచలం సర్పంచ్ శ్రీ పూనెం కృష్ణ, భద్రాచలం ఐటీడీఏ పీఓ శ్రీ రాహుల్, ఏపీఓ శ్రీ డేవిడ్ రాజ్ లకు, సంబంధిత అధికారులకు కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

నవంబర్ 15న బిర్సా ముండా, సోయం గంగులు విగ్రహాల ఏర్పాటు

తదుపరి కార్యక్రమాల్లో భాగంగా నవంబర్ 15న భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా జనజాతీయ గౌరవ్ దివస్‌ను ఘనంగా నిర్వహించడంతో పాటు, భద్రాచలం బ్రిడ్జి సెంటర్‌లో బిర్సా ముండా విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆదివాసీ ఐక్య సంఘాల వేదిక ప్రకటించింది.

అదే రోజు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, దమ్మపేట ప్రాంతానికి చెందిన ఆదివాసీ ముద్దుబిడ్డ కోయ బెబ్బులి సోయం గంగులు విగ్రహాన్ని భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లోని ఆదివాసీ యోధుల విగ్రహాల పక్కన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఆదివాసీ చరిత్ర, పోరాట యోధుల త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాలను నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.

ఈ సమావేశంలో ఆదివాసీ సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ తెల్లం రమణయ్య, కో-కన్వీనర్ ముర్ల రమేష్, నాయకులు కుంజా ధర్మా, పూనెం వీరభద్రం, గుండు శరత్, వీసాల కృష్ణయ్య, కొండ్రు వీరస్వామి, నిట్టా రాజు, కుంజా శ్రీను, కుంజా సంతోష్, కోర్సా చినబాబు దొర, చింతా అరుణ, వర్ష వసంత్, వీసాల ఉమాదేవి, కుంజా బేబీ రాణి తదితరులు పాల్గొన్నారు.

Sunday, January 5, 2025

Philanthropic Venture

 Chippa Srinivas and Satyavati, the couple who settled at Hyderabad donated two cycles of Hero brand to the Vanavasi kalyana parishat (Komaram Bhim vidhyarti nilayam) located at Charla.

 The donation has been made by them on the occasion of birthday of their offspring named Mani deep and Tej deep. Total worth of them is Rs.13,000/- and honorary adviser BVSL Narasimha Rao asked that Pupil should take the opportunity of donations for their upliftment. 

 And he congratulated the donors in the event held on the occasion.Chippa Narasimha murthy handed over the cycles to Gondi Shobhan Babu (Prachanda pramukh).Javvadi Muralikrishna (vice-president), Vemulapalli Praveen (Treasurer), Gondi Prasanna kumari (Nilaya pramukh) and inmates of Vanavasi Nilayam attended.


#philanthropic #venture #vanavasikalyana #parishat