Friday, September 11, 2026

ఈ నెల 17 న తెలంగాణా విమోచనా దినోత్సవాన్ని జరపాలి

 

 శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మరియు మండల నాయకులు  ఈనెల సెప్టెంబర్ 17 వ తారీకు నాడు కోరినారు.తెలంగాణా విమోచనా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని, అదేవిధంగా భద్రాచలంమండల కేంద్రంలో అధికారికంగా జరపాలని భద్రాచలం మండల MRO గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 17 వ తారీకు నాడు నిజాం రాజుల నిరంకుశ పాలనను అంతం చేసి అనేక పోరాటాల వల్ల, ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది, కాబట్టిఈ నెల సెప్టెంబర్ 17వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం అధికారికంగా జరుపుకోవాలని కోరినారు.

ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుంజాధర్మ . జిల్లా కార్యవర్గ సభ్యులు ములిశెట్టి రామ్మోహన్ రావు, జిల్లా నాయకులు నిడదవోలు నాగబాబు, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు దేవరపల్లి వెంకటేశ్వర్లు, ఓబీసీ జిల్లా నాయకులు గుమ్మాల వెంకటేశ్వర్లు సీనియర్ నాయకులు ఆవుల సుబ్బారావు , మండల ప్రధాన కార్యదర్శులు ముత్యాల చంద్రశేఖర్,  చెల్లిబోయిన వెంకన్న మండల ఉపాధ్యక్షులు షేర్ శ్రీనివాస్, గంగులకుర్తీ రామాచారి, యువ మోర్చా నాయకులు ములిశెట్టి నిఖిల్, ఓబిసి మండల ప్రధాన కార్యదర్శి. జంపాల ప్రభాకర్ తదితరులు ఫాల్గొన్నారు.  


 

No comments:

Post a Comment

Thanks for your visit and comment.