Thursday, September 10, 2026

విద్యార్థుల ధ్రువపత్రాల జాప్యాన్ని వెంటనే పరిష్కరించాలి


ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, పీజీ ప్రవేశాల ప్రక్రియలు కొనసాగుతున్న వేళ విద్యార్థులకు అవసరమైన కుల, సమగ్ర, ఆదాయ, నివాస ధ్రువపత్రాల జారీలో జరుగుతున్న జాప్యాన్ని వెంటనే పరిష్కరించాలని కోరుతూ భద్రాచలం బీజేపీ ఎస్టీ మోర్చా, యువమోర్చా ఆధ్వర్యంలో భద్రాచలం తహసీల్దార్ వై. రవికుమార్కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా *బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా సంతోష్* మాట్లాడుతూ, మీ సేవ ద్వారా దరఖాస్తు చేసిన అనంతరం సంబంధిత సిబ్బంది పరిశీలన, ఆర్‌ఐ ధృవీకరణ, తహసీల్దార్ స్థాయి ఆమోదం వంటి వివిధ దశల్లో సమన్వయం లోపించడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఉద్యోగ, విద్యా ప్రవేశాల గడువులు సమీపిస్తున్న నేపథ్యంలో *పెండింగ్ దరఖాస్తులను ప్రత్యేకంగా సమీక్షించి, అత్యవసర దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి ధ్రువపత్రాలను త్వరితగతిన జారీ చేయాలని* కోరారు. అలాగే విద్యార్థులు తమ ధ్రువపత్రాల దరఖాస్తు స్థితిని సులభంగా తెలుసుకునేందుకు తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

అదేవిధంగా, *ఉద్యోగం లేదా విద్యా ప్రవేశానికి గడువు ఉన్న విద్యార్థులు* తమ పెండింగ్ ధ్రువపత్రాల వివరాలను బీజేపీ సహాయ కేంద్రానికి పంపితే, వారి దరఖాస్తు స్థితిని సంబంధిత అధికారుల వద్ద తెలుసుకుని, అవసరమైన మేరకు అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఫాలోఅప్ చేస్తామని కుంజా సంతోష్ తెలిపారు.

📱 *వాట్సాప్ సహాయ కేంద్రం: 9866060034*

విద్యార్థులు మీ సేవ దరఖాస్తు సంఖ్య, ధ్రువపత్రం పేరు, దరఖాస్తు తేదీ, ఉద్యోగం/ప్రవేశానికి సంబంధించిన గడువు వివరాలను పై నంబర్‌కు వాట్సాప్ చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో యువమోర్చా నాయకులు ములిశెట్టి నిఖిల్, అన్నెం సాయి లక్ష్మణ్, కిలారు అంజి, గంగులకుర్తి రామాచారి తదితరులు పాల్గొన్నారు. 

 

No comments:

Post a Comment

Thanks for your visit and comment.