Thursday, September 10, 2026

సాయి బాబా స్వర్ణ సింహాసనానికి లక్ష విరాళం

భద్రాచల వాసి ప్రముఖ పర్యావరణ ప్రేమికుడు భద్రాచలం గ్రామాన్ని హరిత భద్రాద్రి గా తీర్చి దిద్దాలని గత 15 స. లు గా వారి బృందం తో కలసి తీవ్రం గా కృషిచేస్తున్న ''వృక్ష మిత్ర '' రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహిత లయన్ డా. గోళ్ళ భూపతి రావు కు ఎన్నో ప్రశంసలు. భద్రాచలం గ్రామం పచ్చదనం తో ఉంది అంటే అత ని పట్టుదల అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు.

 అంతే కాకుండా స్వయం గా దానగు ణం గల వీరు ఎన్నో సేవ కార్యక్రమాలు ని ర్వహిస్తున్నారు. అడిగిన వారికి కాదనకుండా సహయం చేయటం, మొక్కలు పంచడం వీరికి అలవాటు. భద్రాచలం లో ఉన్న దేవాలయాలకు వారి కుమారుడు డాక్టర్ గోళ్ళ వరుణ్ కుమార్ ఎమ్ ,డి , యు. ఎస్. ఏ., వారు కూడా విరాళాలు అందచేశారు. వీరి చిన్నతనం లో స్థాపించిన సాయిబాబా ఆలయం వారికి స్వర్ణ సింహాసనం తయారు నిమిత్తం గోళ్ళ భూపతి రావు, మంజుల రాణి దంపతులు ఒక లక్ష విరాళం అందచేశారు. 

ఈ సందర్బంగా గోళ్ళ భూపతి రావు మాట్లాడుతూ ప్రతి వారు వారి జీవితం లో కొంత భాగం పేదవారికి సహాయం చేయడం అలవాటుగా నేర్చుకోవాలని ఇతరులకు ఆదర్శం గా నిలవాలని తెలియ చేసారు. అదేవిధంగా నా ఈ సమాజ సేవ కార్యక్ర మాలను కొనసాగిస్తూ పర్యావరణ పరిరక్షణకు ఎల్లప్పుడు ముందు వరుసలో ఉంటానని తెలియచేశారు. ఈ కార్యక్రమం లో ఆలయ అధ్యక్షులు శ్రీ ఆదినారాయణ,శ్రీ చా రుగుళ్ల సుబ్బా రావు కోశాధికారి వెంకటేశ్వర రావు, శ్రీ కడలి నాగరాజు మరియు ఆలయ అర్చకులు శ్రీ రామ్ శర్మ తదితరులు పాల్గొన్నారు


No comments:

Post a Comment

Thanks for your visit and comment.